Good News : రైతన్నకు శుభవార్త.. సన్న ధాన్యానికి బోనస్ విడుదల
- సన్నా ధాన్యానికి బోనస్ విడుదల చేసిన పౌరసరఫరాల శాఖ
- 500 కోట్ల రూపాయల బోనస్ విడుదల
- ఇప్పటివరకు 1,429 కోట్ల రూపాయలు సన్నాలకు విడుదల చేసిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సంబరాల్లో ఉన్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ‘సన్న వరి ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బోనస్’ పథకానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ తాజాగా నిధులను విడుదల చేసింది. పండుగ పూట రైతుల ఖాతాల్లోకి ఈ బోనస్ సొమ్ము చేరుతుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Snapchat Offer : స్నాప్చాట్ Storage టెన్షన్ ఇక లేదు.! Subscription లేకుండా Memory సేవ్.!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
సన్న రకం ధాన్యం పండించిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజాగా రూ. 500 కోట్ల బోనస్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్లో సన్నాలు పండించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ప్రతి రైతుకు క్వింటాల్కు రూ. 500 అదనంగా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.
ఈ ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు సన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ. 1,429 కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం. సాధారణ మద్దతు ధరతో పాటు ఈ బోనస్ సొమ్ము కూడా తోడవ్వడంతో రైతులకు ఆర్థికంగా భారీ ఊరట లభిస్తోంది. కేవలం సన్న రకం సాగును ప్రోత్సహించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ భారీ వ్యయాన్ని భరిస్తోంది.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలను నమోదు చేసి, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే ఈ బోనస్ మొత్తాన్ని జమ చేస్తున్నారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగుతోంది. పండుగ ఖర్చుల సమయంలో ఈ నగదు చేతికి అందడం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Ambati Rambabu: జగన్ హయాంలో 3.32 లక్షల కోట్లు అప్పు.. ఈ 18 నెలల్లో 3.02 లక్షల కోట్ల అప్పులు..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!