భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్లలో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) రంగంలో భారతీయ స్టార్టప్ల సామర్థ్యాన్ని గుర్తించిన టెక్ దిగ్గజం గూగుల్, వారి అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలను ప్రకటించింది. ఇటీవలే జరిగిన ‘గూగుల్ AI స్టార్టప్ కాన్క్లేవ్’లో భాగంగా భారతీయ AI రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించింది. 1. మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్.. స్టార్టప్ల నుండి గ్లోబల్ బ్రాండ్ల వరకు చాలా వరకు […]
చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు స్పేస్ లేకుండా పోయింది. అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది…? పార్టీ తరపున బీసీలకు రిజర్వేషన్ ని ఇస్తారా..? మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే వ్యూహమా? బీసీలకు జనాభా ప్రకారం అన్నిట్లో వాటా ఇస్తామని ప్రకటిస్తూ వచ్చింది కాంగ్రెస్. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కోర్టులో పరిగణలోకి రాకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కోర్టులో ఉండడంతో త్వరలో జరగబోయే మున్సిపల్ […]
Bhogi 2026: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు భోగి పండుగతోనే ప్రారంభమవుతాయి. ధనుర్మాసం ముగింపుకు గుర్తుగా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు వచ్చే ఈ పండుగకు ఆధ్యాత్మికంగా , శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2026 సంవత్సరంలో భోగి పండుగ కొత్త ఆశలను, ఆనందాలను మోసుకొస్తోంది. భోగి అంటే కేవలం మంటలు వేయడం మాత్రమే కాదు.. మనలో ఉన్న పాత ఆలోచనలను, నెగటివిటీని (ప్రతికూలతను) వదిలించుకుని, కొత్త వెలుగులోకి అడుగుపెట్టే ఒక గొప్ప సందర్భం. ఈ […]
మన నిత్యజీవితంలో పరిసరాల పరిశుభ్రత ఎంత ముఖ్యమో, మనకు తెలియకుండానే మన ఇంట్లోకి ప్రవేశించే జీవుల పట్ల అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. అటువంటి జీవులలో ఎలుకలు ప్రధానమైనవి. ఎలుకలు కేవలం ఆహారాన్ని పాడుచేయడమే కాకుండా, మనుషులను కరిచినప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. చాలామంది ఎలుక కాటును ఒక చిన్న గాయంగానో లేదా సాధారణ గీతగానో భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, మురికి కాలువలు , అపరిశుభ్ర ప్రాంతాల్లో తిరిగే ఎలుకల శరీరంలో, […]
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన పాపులర్ ‘A’ సిరీస్లో భాగంగా సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ఫోన్, Samsung Galaxy A07 5Gని థాయ్లాండ్ మార్కెట్లో నిశ్శబ్దంగా లాంచ్ చేసింది. 6,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ , 6 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన ఫీచర్లు , స్పెసిఫికేషన్లు: 1. డిస్ప్లే: ఈ స్మార్ట్ఫోన్ 6.7 అంగుళాల HD+ […]
బీఆర్ఎస్ నాయకత్వంపై , గత ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ప్రతి రూపాయిని పొదుపు చేస్తూ పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. “గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది తప్ప, […]
గ్రామీణం కాదు…పట్టణమే తమ బలమని కమలం పార్టీ భావిస్తోంది. నగరాల్లో తమ క్రేజ్ వేరే లెవల్ అని ప్రతీసారి కాన్ఫిడెన్స్గా చెబుతోంది. ఇప్పుడు తెలంగాణలో అదే మాట…బీజేపీకి అగ్ని పరీక్షగా మారింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి నగారా మోగనుంది. 117 మున్సిపాలిటీలకు, 6 మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ర్ట ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల గుర్తుల మీద ఈ ఎన్నికలు జరుగుతాయి. […]
రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు రాజకీయ రంగు పులుముకున్నాయా? సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వాపస్ తీసుకోవడంపై రాద్దాంతం పెరుగుతోందా? సివిల్ సూట్ దాఖలు చేస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా రిట్ పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమలసాగర్ అంశంపై రిట్ […]
టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండు దిగ్గజ సంస్థలు ఆపిల్ (Apple) , గూగుల్ (Google) చేతులు కలిపాయి. తన ఐఫోన్ వినియోగదారులకు అత్యాధునిక కృత్రిమ మేధ (AI) సేవలను అందించడమే లక్ష్యంగా, ఆపిల్ తన తదుపరి తరం ‘సిరి’ (Siri) , ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్ల కోసం గూగుల్ జెమిని (Gemini) మోడళ్లను ఉపయోగించుకునేలా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. సిరి సరికొత్త అవతారం చాలా కాలంగా ఆపిల్ వినియోగదారులు సిరి సామర్థ్యాలపై అసంతృప్తిగా ఉన్న […]
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజకీయ రంగాన్ని తాను ఒక పవిత్రమైన యజ్ఞంలా , తపస్సులా భావిస్తానని చాటిచెప్పారు. అధికార దాహం కంటే ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తూ, గత దశాబ్దాలుగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు , రాజకీయ పార్టీలకు అతీతంగా తాను పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజమని, అయితే తనపై రాజకీయంగా విమర్శలు చేసే శత్రువుల నియోజకవర్గాలు , గ్రామాలు కూడా సమానంగా […]