Ponguleti Srinivas Reddy : శంకుస్థాపనలు మీవి.. పనులు మావి.!
- శంకుస్థాపనలు మీవి.. పనులు మావి!
- బీఆర్ఎస్ వైఫల్యాలపై గట్టి దాడి
- కేటీఆర్ కు మున్సిపల్ 'సెమీఫైనల్' ఛాలెంజ్
- కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నాయకత్వంపై , గత ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ప్రతి రూపాయిని పొదుపు చేస్తూ పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. “గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది తప్ప, పనుల కోసం నిధులు కేటాయించలేదు. కానీ మా ప్రజా ప్రభుత్వం మాటల కంటే చేతలకు ప్రాధాన్యత ఇస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
Siriలోకి Gemini పవర్.. Googleతో Apple భారీ AI ఒప్పందం.!
పదేళ్ల కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని పొంగులేటి మండిపడ్డారు. కనీసం లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. “దశాబ్ద కాలంలో పేదలకు ఒక చిన్న ఇల్లు కూడా ఇవ్వలేని వారు, ఈరోజు మాట్లాడుతున్నారు. మేం పార్టీలతో సంబంధం లేకుండా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తున్నాం” అని ఆయన వివరించారు.
కేటీఆర్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. మాయ మాటలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన వారు, మళ్ళీ అధికారం కోసం పిచ్చి వేషాలు వేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్ అని అంటున్న కేటీఆర్ కు, “రా.. ఈ గేమ్ ఆడదాం” అంటూ బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటం వల్ల పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల మధ్యే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టబోమని మంత్రి తేల్చి చెప్పారు. చివరగా, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!