అక్రమ నిర్మాణాలపై యాక్షన్ ప్లాన్ కొనసాగుతున్నది. గురువారం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక అపార్ట్ మెంట్ లో ఉన్న రెండు బ్లాక్ లపై అక్రమ అంతస్తుల నిర్మాణాలను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం కూల్చి వేసింది. నిజాం పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 92/పి లో ఒక యజమాని తనకు ఉన్న 840 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ + 2 అంతస్తుల భవనానికి అనుమతి తీసుకుని మూడు(3) బ్లాక్ లను స్లిట్ +5 […]
సీపీసీని అమలు చేస్తున్నారా..? అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను అమలు చేస్తున్నారా..? ఆఫీసర్స్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నారా..? ఏపీలో అమలు చేయాలనుకుంటోంది ఏ పీఆర్సీ అని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేన్ని అమలు చేస్తున్నారో చెబితే మేం చర్చలకు సిద్దమని ఆయన స్పష్టం చేశారు. సీపీసీని అమలు చేస్తే.. అందులో ఉన్న మిగిలిన అంశాలనూ అమలు చేస్తారా..? అని ఆయన అన్నారు. ప్రభుత్వ కమిటీ మీద […]
పీఆర్సీ విషయంలో గందరగోళం ఉంది కాబట్టి ప్రస్తుతానికి పాత జీతాలే ఇవ్వాలని సీఎస్ ను కోరామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. కానీ సీఎస్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం వేసిన సంప్రదింపుల కమిటీకి మా స్టీరింగ్ కమిటీ బృందం వెళ్లి లేఖ ఇచ్చింది.. దానికీ సమాధానం లేదని ఆయన తెలిపారు. సమాధానాలు చెప్పకుండా.. మమ్మల్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చర్చలకు వెళ్లమని మాపై ఒత్తిడి తేవాలని […]
ఇటీవల జగన్ సర్కార్ ప్రకటించిన నూతన జిల్లాల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నూతన జిల్లాల అంశంపై టీడీపీ అధినేత పలు విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నూతన జిల్లాల్లో ఓ జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ అభిమానిగా నేను ఎంతో సంతోషిస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా నా తరపున, ఎన్టీఆర్ ను దైవంగా భావించే […]
ఏపీ ప్రభుత్వం ఇటీవల 13 కొత్త జిల్లాల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ 26 జిల్లాల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చంద్రబాబుకు 26 కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివరించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీలోనే కొత్త జిల్లాలు నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రానికి జగన్ […]
ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి జిల్లాల విభజన అంశం తీసుకువచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారన్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలని, సమస్యలు తలెత్తేలా నిర్ణయాలు ఉండకూడదన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తామని, ఎన్టీఆర్ ను […]
ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాల అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 26 జిల్లాలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు విముఖతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ గా భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కొత్త జిల్లాల ప్రక్రియను సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతుందని సీనియర్ నేతలు చంద్రబాబుకు వివరించారు. […]
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై విముఖత తో ఉన్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన కమిటీ గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చర్చకు రాలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల […]
డ్రగ్స్ కేసు హైదరాబాద్ ను కుదిపేస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉండడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ డ్రగ్స్ పది మంది పరారీలో ఉన్నారని, పరారీలో నలుగురు బడా బిజినెస్ మేన్ లు సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్దపల్లి, అశోక్ జైన్ లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న బిజినెస్ మేన్ ల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు […]
ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని, అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్దమన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని, పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామని, పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమేనని ఆయన వెల్లడించారు. చర్చలకు […]