New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, జూలై 15, 2026 నాటికి సరికొత్త ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక బృందంగా వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత IRCTC ప్లాట్ఫామ్పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ క్రాష్ అవ్వడం, గందరగోళంగా ఉండే క్యాప్చా సిస్టమ్, పాతబడిన డిజైన్, టికెట్ బుకింగ్లో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి.. తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేవలం 30 రోజుల గడువులోగా సరికొత్త వెబ్సైట్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జూలై 15 కల్లా ఈ కొత్త ప్లాట్ఫామ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వీటిలో సులభంగా అర్థమయ్యే ఇంటర్ఫేస్, వేగవంతమైన బుకింగ్ విధానం ఇందులో ఉండనున్నాయి.
Also Read
- Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
- Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
- Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
దీనితో పాటు, 1986 నాటి పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను కూడా ఇండియన్ రైల్వేస్ పూర్తిగా మార్చబోతోంది. ఆగస్టు 2026 నాటికి కొత్త రిజర్వేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నారు. రైల్వే టికెటింగ్ సేవలను ఆధునీకరించడం, బుకింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రక్రియను వేగవంతం చేయడం దీని లక్ష్యం. ఇండియన్ రైల్వేస్ 2002లో ఆన్లైన్ రిజర్వేషన్లను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో కౌంటర్ల కంటే ఆన్లైన్ బుకింగ్స్ విపరీతంగా పెరిగాయి. అధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం రైలు టికెట్లు ఆన్లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మార్పులు కోట్లాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి.
తాజావార్తలు
-
Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
-
Jeep Meridian: భారత్లో జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. కొత్త ఫీచర్లు, AI అసిస్టెంట్.. ధర ఎంతంటే?
-
Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
-
Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
-
Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!