New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, జూలై 15, 2026 నాటికి సరికొత్త ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక బృందంగా వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత IRCTC ప్లాట్ఫామ్పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ క్రాష్ అవ్వడం, గందరగోళంగా ఉండే క్యాప్చా సిస్టమ్, పాతబడిన డిజైన్, టికెట్ బుకింగ్లో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి.. తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేవలం 30 రోజుల గడువులోగా సరికొత్త వెబ్సైట్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జూలై 15 కల్లా ఈ కొత్త ప్లాట్ఫామ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వీటిలో సులభంగా అర్థమయ్యే ఇంటర్ఫేస్, వేగవంతమైన బుకింగ్ విధానం ఇందులో ఉండనున్నాయి.
Also Read
- FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
- Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
దీనితో పాటు, 1986 నాటి పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను కూడా ఇండియన్ రైల్వేస్ పూర్తిగా మార్చబోతోంది. ఆగస్టు 2026 నాటికి కొత్త రిజర్వేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నారు. రైల్వే టికెటింగ్ సేవలను ఆధునీకరించడం, బుకింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రక్రియను వేగవంతం చేయడం దీని లక్ష్యం. ఇండియన్ రైల్వేస్ 2002లో ఆన్లైన్ రిజర్వేషన్లను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో కౌంటర్ల కంటే ఆన్లైన్ బుకింగ్స్ విపరీతంగా పెరిగాయి. అధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం రైలు టికెట్లు ఆన్లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మార్పులు కోట్లాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి.
తాజావార్తలు
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?