New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, జూలై 15, 2026 నాటికి సరికొత్త ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక బృందంగా వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత IRCTC ప్లాట్ఫామ్పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ క్రాష్ అవ్వడం, గందరగోళంగా ఉండే క్యాప్చా సిస్టమ్, పాతబడిన డిజైన్, టికెట్ బుకింగ్లో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి.. తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేవలం 30 రోజుల గడువులోగా సరికొత్త వెబ్సైట్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జూలై 15 కల్లా ఈ కొత్త ప్లాట్ఫామ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వీటిలో సులభంగా అర్థమయ్యే ఇంటర్ఫేస్, వేగవంతమైన బుకింగ్ విధానం ఇందులో ఉండనున్నాయి.
Also Read
- Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
దీనితో పాటు, 1986 నాటి పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను కూడా ఇండియన్ రైల్వేస్ పూర్తిగా మార్చబోతోంది. ఆగస్టు 2026 నాటికి కొత్త రిజర్వేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నారు. రైల్వే టికెటింగ్ సేవలను ఆధునీకరించడం, బుకింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రక్రియను వేగవంతం చేయడం దీని లక్ష్యం. ఇండియన్ రైల్వేస్ 2002లో ఆన్లైన్ రిజర్వేషన్లను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో కౌంటర్ల కంటే ఆన్లైన్ బుకింగ్స్ విపరీతంగా పెరిగాయి. అధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం రైలు టికెట్లు ఆన్లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మార్పులు కోట్లాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!