షాకింగ్.. అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు సతీమణి మృతి! ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. ఇక, కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్లో పూర్తయినట్లు తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు, రుక్మిణి […]
రాజస్థాన్ అల్వార్లో మళ్లీ బ్లూ డ్రమ్ము కలకలం సృష్టించింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు శవం లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు.. హన్సరాజ్ అనే వ్యక్తిని చంపేసి అందులో కుక్కేశారు.
Nagarjuna Sagar : తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాల కారణంగా నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులు రికార్డు స్థాయిలో నీటిని అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్ఫ్లో 3 లక్షల 70 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 3 లక్షల 18 వేల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి కారణంగా 12 గేట్లు 10 అడుగుల […]
భారతీయ సినీ పరిశ్రమకు హైదరాబాదు కేంద్ర బిందువుగా మారాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సినీ రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మెదక్ జిల్లా తూప్రాన్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి గాయత్రి నగర్ కాలనీ, ఏబీ కాలనీతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. భారీ వరదతో ఇళ్లు నీటమునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రిచెస్ట్ వినాయకుడు.. ఏకంగా రూ. 474 కోట్లతో ఇన్సూరెన్స్ ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే గణపయ్య భక్తులు విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. ఊరు వాడలు వినాయక మండపాలతో ముస్తాబవుతున్నాయి. కాగా గణేష్ వేడుకలకు ముందే ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ హాట్ టాపిక్ గా మారింది. తమ వినాయకుడికి ఏకంగా రూ. 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. దీంతో రిచెస్ట్ గణపతిగా రికార్డ్ సృష్టించాడు. గతేడాది కూడా […]
నగరంలో వరద సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం అమీర్పేట్, మైత్రి వనం పరిసర ప్రాంతాలను పర్యటించారు. మైత్రి వనం వద్ద వరద ఉధృతి తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యలపై ఆయన ఆధ్వర్యంలోనే పరిశీలనలు జరిపారు.
Vehicle Life Tax : తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై లైఫ్టాక్స్ పెంచింది. ఆగస్టు 14 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రవాణా, రోడ్లు-భవనాల శాఖ జారీ చేసిన జీఓ నెం.53 ద్వారా మోటార్ వాహనాల పన్ను చట్టం, 1963లోని షెడ్యూల్స్లో మార్పులు చేసింది. ఈ మేరకు రెండు, మూడు, నాలుగు చక్రాల నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్టాక్స్ వసూలు చేయనుంది. తాజా నిర్ణయం ప్రకారం, రూ.50 వేలు లోపు ధర కలిగిన రెండు చక్రాల వాహనాలపై […]
తెలంగాణలో కుల గణనను పగడ్బంధీగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుల గణనను పూర్తి చేశామని, వందకు వంద శాతం సరిగ్గా లెక్కలు నమోదయ్యాయని తెలిపారు.
Indian Railways : తెలుగు రాష్ట్రాలలో రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం పాపట్పల్లి-డోర్నకల్ బైపాస్ మధ్య 3వ రైలు లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దృష్టిలో ఉంచుకొని ఐదు రోజులపాటు 10 రైళ్లు పూర్తి సర్వీసు రద్దు చేయబడ్డాయి. ఈ రద్దు రైల్వే ప్రయాణికుల కోసం […]