Aadi Srinivas : హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..
- టిమ్స్ హాస్పిటల్ పనులపై హరీష్ రావుపై ఆరోపణలు
- సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో ఆస్పత్రుల నిర్మాణం వేగవంతం
- ఉస్మానియా, ఎంజిఎం ఆస్పత్రులపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
- జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ నేతలను పట్టించుకోరని ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : జూబ్లీహిల్స్ ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చర్యలపై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.. “పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలి. అధికారం పోవడానికి ఏడాది ముందు టిమ్స్ హాస్పిటల్ కోసం టెండర్లు పిలిచారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వీటిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి” అని అన్నారు.
Shubman Gill : రోహిత్ శర్మకు షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్గా గిల్..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం విషయంలో హరీష్ రావు ఆరోపణలు నిజం కాదని ఆయన తేల్చారు. “విదేశాల నుంచి ఆధునిక వైద్య పరికరాలు రావాల్సి ఉండటంతో కొంత సమయం పడుతోంది. కానీ పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలని మాకు ఉద్దేశం లేదు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతోనే ప్రజలకు అందించబోతున్నాం” అని వివరించారు. “ఉస్మానియా వర్షాల్లో మునిగిపోయినా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కానీ మా సీఎం గోషామహల్లో ఆధునిక సౌకర్యాలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు సంస్థ ఇప్పటికే పనులు మొదలుపెట్టింది” అని చెప్పారు.
అలాగే వరంగల్లో ఎంజిఎం ఆస్పత్రి నిర్మాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. “త్వరలోనే ఆ ఆస్పత్రిని కూడా ప్రారంభించబోతున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కోట్లాది రూపాయలను పేదలకు అందిస్తున్నాం” అని గుర్తు చేశారు. “పదేళ్ల పాటు ప్రభుత్వాస్పత్రులను గాలికి వదిలేసి ఇప్పుడు మాకు పాఠాలు చెబుతున్నారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు హరీష్ రావు, కేటీఆర్లను పట్టించుకోరు” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!