డిసెంబరు 25 రేస్ లో బెల్లం vs మేక.. తండ్రి శ్రీకాంత్ నటనను వారసత్వంగా తీసుకున్న రోషన్ మేక. టాలీవుడ్ హృతిక్ రోషన్లా పేరైతే వచ్చింది కానీ సినిమాలు కంప్లీట్ చేయడంలో జోరు చూపించడం లేదు. రోషన్ పెళ్లి సందడితో స్టార్ అయ్యాడు కానీ ఎక్కడైతే స్టార్టైయ్యాడే అక్కడే ఆగిపోయాడు. నాలుగేళ్లుగా అతడి నుండి ఫిల్మ్ రాలేదు. ప్రజెంట్ ఛాంపియన్ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు రోషన్. ఈ ఇయర్ రోషన్ బర్త్ డే సందర్భంగా ఛాంపియన్ […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
బంధువులదేముంది రుతువుల్లాంటి వారు….. వస్తారు, పోతారు.. కానీ… వారసులు మాత్రం చెట్లలాంటి వారు. వస్తే పాతుకుపోతారన్న సినిమా డైలాగ్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లాలో. అక్కడ రాజకీయ వారసులు చేస్తున్న హంగామా అలా ఉందట. ప్రతి ప్రధాన పార్టీ తరపున పొలిటికల్ తెరంగేట్రం చేయడానికి వారసులంతా మూకుమ్మడిగా ఉవ్విళ్ళూరుతున్న ఆ ఉమ్మడి జిల్లా ఏది? అక్కడ ప్రత్యేకత ఏంటి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఎన్నికల్ని తమ వారసులకు అప్రంటీస్లా వాడుకోవాలని […]
ఏపీలో తాజాగా బయటపడ్డ నకిలీ లిక్కర్ స్కామ్ టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి అసలు పార్టీలోకి ఎలా వచ్చారు? పెద్దిరెడ్డి కుటుంబానికి వీర విధేయుడైన వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండానే చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారా? అలా ఆయన్ని ప్రభావితం చేసిందెవరు? ఇప్పుడు వేళ్ళన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి? మేం మొదట్నుంచి చెప్తూనే ఉన్నాం…. మీకే బుర్రకెక్క లేదు. ఈక్వేషన్లు, పోల్ మేనేజ్మెంట్ అంటూ… ఏవేవో కాకి లెక్కలు చెప్పి, మమ్మల్ని మభ్యపెట్టి […]
University : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (SSCTU) లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు అవుతూ, అత్యుత్తమ రీసెర్చ్-ఆధారిత యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. “జ్ఞానం పరమం ధ్యాయం” అనే నినాదంతో ఈ విశ్వవిద్యాలయం అనువర్తిత, పరిశోధన , ఆవిష్కరణలకు కేంద్రంగా […]
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించిన భూముల వేలం రికార్డుల సృష్టికర్తగా నిలిచింది. రాయదుర్గం ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీ భూభాగాలపై నిర్వహించిన ఈ వేలం ఊహించని స్పందనకు దారితీసింది. ఒక ఎకరం భూమి ధర ₹177 కోట్ల వరకు చేరడం మార్కెట్ లో శ్రేష్ఠ రికార్డ్ స్థాపించిందని తెలుస్తోంది.
వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. ఎవరు అవుతారో చూస్తాం! మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనపై ఉత్కంఠకు తెరలేపింది. రోడ్డు మార్గం ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. తమిళనాడు కరూర్లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా జగన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ప్రకటించారు. జగన్ టూర్ కోసం భారీ జన సమీకరణ జరుగుతున్నందున […]