Today (25-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో రిపబ్లిక్ డే ముందస్తు జోష్ ఏమాత్రం కనిపించలేదు. నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు.. మార్కెట్ సెంటిమెంట్ను కుదిపేయడంతో ఫ్రంట్లైన్ సూచీలు ఇవాళ బుధవారం విపరీతంగా క్షీణించాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 850 పాయింట్లకు పైగా తగ్గిపోయింది. నిఫ్టీ.. బెంచ్ మార్క్ కన్నా దిగువకు పడిపోయింది. అయినప్పటికీ మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యూనీ లీవర్, హిండాల్కో, బజాజ్ ఆటో, టాటా స్టీల్ షేర్లు బాగా రాణించాయి.
Wipro Layoffs: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో.. 450 మంది ఎంట్రీ లెవల్ ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుంచి తొలగించింది. శిక్షణ ఇచ్చినప్పటికీ పనితీరులో మెరుగుదల లేకపోవటంతో వాళ్లను ఇంటికి పంపక తప్పలేదని పేర్కొంది. స్టాఫ్ పెర్ఫార్మెన్స్ విషయంలో తాము అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని, అప్పగించిన పనిని ఏవిధంగా చేస్తున్నారనే విషయంలో ఫ్రెషర్స్ నుంచి ఓ స్థాయి సామర్థ్యాన్ని ఆశిస్తామని కంపెనీ తెలిపింది.
Today (25-01-23) Business Headlines: Airtel మినిమం రీఛార్జ్ రూ.155: Airtel ప్రీపెయిడ్ మినిమం రీఛార్జ్ ఒక్కసారే 57 శాతం పెరిగి 155 రూపాయలకు చేరింది. దీంతో ఇప్పుడున్న 99 రూపాయల ప్లాన్ రద్దయింది. కొత్త ప్లాన్.. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇందులో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ఒక జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ అందిస్తారు. హలో మ్యూజిక్, వింక్ మ్యూజిక్ సర్వీసులు సైతం ఉచితం.
Today (23-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం వరకు సానుకూలంగానే కొనసాగి చివరికి మంచి లాభాల్లో ముగియటం విశేషం. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ రోజంతా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ కావటానికి చాలా కారణాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు అంతర్జాతీయంగా బలమైన సెంటిమెంట్ సిగ్నల్స్ అందాయి. వివిధ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా వెలువడుతున్నాయి.
Apple Company: iPhoneలో ‘ఐ’ అంటే ఏమిటని అడిగితే చెప్పటానికేమీలేదు. ఎందుకంటే.. అదొక యాపిల్ కంపెనీ ఫోన్ మోడల్ పేరు మాత్రమే. కానీ.. భవిష్యత్తులో ఐఫోన్ అంటే ఇండియా ఫోన్ అని చెప్పుకునే రోజులు రానున్నాయనిపిస్తోంది. 2027వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వాడుకునే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారుకానుండటమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ పర్సంటేజీ 5 కన్నా తక్కువగానే ఉన్నట్లు లేటెస్ట్ న్యూస్ చెబుతున్నాయి.
TCS Recruits Freshers: ఐటీ రంగంలో మేజర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. TCS.. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా లక్షా పాతిక వేల నుంచి లక్షన్నర మంది వరకు ఎంప్లాయీస్ని తీసుకోనున్నట్లు TCS CEO and MD రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
Today (23-01-23) Business Headlines: జూన్ కల్లా ‘విశాఖ’ విస్తరణ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. విశాఖపట్నంలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ పనులను జూన్ చివరికి పూర్తిచేయనుంది. ఈ రిఫైనరీ ప్రస్తుత ప్రొడక్షన్ కెపాసిటీ 83 పాయింట్ 3 లక్షల టన్నులు కాగా దాన్ని దాదాపు రెట్టింపునకు.. అంటే.. ఒకటిన్నర కోట్ల టన్నులకు చేర్చుతున్నారు. ఈ విషయాలను HPCL చైర్మన్ పుష్ప్ జోషి వెల్లడించారు.
Tata Group: విద్యుత్ వాహనాలకు కావాల్సిన బ్యాటరీల తయారీ కోసం టాటా గ్రూపు యూరప్లో యూనిట్ను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నట్లు బ్లూమ్బర్గ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. టాటా మోటార్స్ తన అనుబంధ కంపెనీ జాగ్వర్ ల్యాండ్ రోవర్తో కలిసి ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తేనుంది. అక్కడి నుంచే సెల్ బ్యాటరీ ప్యాక్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించనుంది.
Minister KTR: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ సామాజిక మాద్యమం ట్విట్టర్లో ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న టాప్-30 లీడర్లు మరియు సంస్థల లిస్టులో చోటు సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా 12వ ర్యాంకును పొందారు. ఈ జాబితాలో ఇండియాకి చెందిన కేవలం ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మంత్రి కేటీఆర్ కావటం విశేషం.
Today (21-01-23) Business Headlines: పెరిగిన విదేశీ మారక నిల్వలు: ఇండియా విదేశీ మారక నిల్వలు 10 పాయింట్ నాలుగు ఒకటి బిలియన్ డాలర్లు పెరిగి 572 బిలియన్ డాలర్లకు చేరాయి. తద్వారా ఐదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. జనవరి 13వ తేదీ వరకు ఉన్న ఈ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఫారెక్స్ రిజర్వ్స్ ఈ రేంజ్లో పెరగటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. బంగారం నిల్వల్లో కూడా పెరుగుదల కొనసాగుతోంది.