High Court: తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు విచారించనుంది. బీసీ జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు కేటాయించలేదన్న ఆరోపణలతో పలువురు అభ్యర్థులు కోర్టు ఆశ్రయించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల తిమ్మనోనిపల్లి గ్రామ రిజర్వేషన్లపై ఒక పిటిషన్ దాఖలైంది. గ్రామంలోని అన్ని వార్డులను ఎస్సీ, ఎస్టీ వర్గాలకే కేటాయించారని, కానీ అక్కడ బీసీ జనాభా ఎక్కువగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని వాదిస్తున్నారు.
I bomma Ravi: సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ రవిని నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐ బొమ్మ రవిని మరోసారి కస్టడీ అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారణ జరపనున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు ఐ బొమ్మ రవి..
TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆశావాహులు వారి ప్రయత్నాల్లో…
T-Series’ Hanuman Chalisa Crosses 5 Billion Views on YouTube: హిందూ పురాణాల ప్రకారం.. ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది. చిరంజీవి అయిన మారుతీ నేటికీ భూమి తిరుగుతున్నాడని చాలా మంది నమ్మకం. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో సంతోషం, ఆనందం, సంపద, సానుకూల శక్తి పెరుగుతాయని నమ్ముతారు. ఇక హనుమాన్ చాలీసా విశిష్టత గురించి తెలిసిందే. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు. అయితే.. తాజాగా హనుమాన్ చాలీసాను కేవలం…
Guinea-Bissau: ఆఫ్రిక ఖండంలోని మరో దేశంలో తిరుగుబాటు చోటు చేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా-బిస్సావు దేశంలో అకస్మాత్తుగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ తీసుకున్నట్లు సైనిక అధికారులు ప్రకటించారు. సైన్యం తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి, దేశ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. సరళంగా చెప్పాలంటే.. మరొక ఆఫ్రికన్ దేశం కూలిపోయింది. గినియా-బిస్సావు దేశం చిన్నదైనప్పటికీ రాజకీయంగా అస్థిరం ఆ దేశాన్ని పట్టి పీడించింది.
Haryana Lawyer Arrested for Alleged ISI Links: భారత్లో దేశ ద్రోహులు పుట్టగొడుగుల్ల బయటపడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి రహస్య సమాచారం అందించాడనే ఆరోపణలపై హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలోని పోలీసులు ఒక న్యాయవాదిని అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. ఈ సంవత్సరం మేవాట్ ప్రాంతంలో అనుమానిత పాకిస్థానీ గూఢచారులను అరెస్టు చేయడం ఇది మూడవసారి. అరెస్టయిన న్యాయవాదిని నుహ్లోని ఖర్ఖారి గ్రామానికి చెందిన రిజ్వాన్గా గుర్తించారు. అతను గురుగ్రామ్ కోర్టులో…
TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు.
Madapur IT Scam: మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ప్రస్తుతం ఐటీ కారిడార్లో కలకలం రేపుతోంది. స్థానికంగా పేరొందినట్టు నటిస్తూ కార్యకలాపాలు నిర్వహించిన NSN ఇన్ఫోటెక్ ఘరానా మోసం బయటపడింది. శిక్షణ, ఉద్యోగ అవకాశం పేరుతో 400 మందికి పైగా నిరుద్యోగుల దగ్గర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఐటీ కంపెనీ అని నమ్మించి, ఉద్యోగం ఖాయం అని మాటలు చెప్పి భారీగా డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది.
Jagtial: జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. కుటుంబ కలహాలతో భార్య భర్తలను లేపేసింది. ఈ దిగ్భ్రాంతి కరమైన ఘటన ఇరు కుటుంబాల్లో బాధను మిగిల్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య అతని భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తాజాగా కుటుంబ కలహాలు, వాగ్వాదంతో భార్య కోపం తీవ్రరూపం దాల్చింది. దీంతో మొదట రోకలి బండతో భర్త తలపై దాడి చేసినట్లు సమాచారం.
Fake IPS Officer: ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ కలకలం సృష్టించింది.. బాబు బాగోతం మామూలుగా లేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అంటూ శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. ఇద్దరు గన్మెన్లను పెట్టుకుని బిల్డర్లపై శశికాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు.. స్పెషల్ ఆఫీసర్ అంటూ బిల్డర్లతో డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు.. పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూళ్లు చేశాడు.. తీసుకున్న డబ్బు ఇవ్వకుండా గన్మెన్లతో బెదిరింపులకు దిగాడు.. ఈ నిందితుడిపై పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.