Guinea-Bissau: మరో ఆఫ్రికన్ దేశంలో తిరుగుబాటు! అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guinea-Bissau: ఆఫ్రిక ఖండంలోని మరో దేశంలో తిరుగుబాటు చోటు చేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా-బిస్సావు దేశంలో అకస్మాత్తుగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ తీసుకున్నట్లు సైనిక అధికారులు ప్రకటించారు. సైన్యం తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి, దేశ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. సరళంగా చెప్పాలంటే.. మరొక ఆఫ్రికన్ దేశం కూలిపోయింది. గినియా-బిస్సావు దేశం చిన్నదైనప్పటికీ రాజకీయంగా అస్థిరం ఆ దేశాన్ని పట్టి పీడించింది.
READ MORE: Hong Kong: హాంగ్ కాంగ్లో ఘోర విషాదం.. 44 మంది సజీవదహనం
Also Read
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
అధ్యక్ష పదవి, పార్లమెంటు ఎన్నికలు జరిగిన మూడు రోజులకే ఈ సంఘటన జరిగింది. రాజధాని బిస్సావులోని అధ్యక్ష భవనం సమీపంలో మధ్యాహ్నం భారీ కాల్పులు జరిగాయి. దీంతో సైనిక దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. చాలా మంది పౌరులు భయంతో నగరం నుంచి పారిపోవడం కనిపించింది. కాలినడకన, వాహనాల ద్వారా దేశ విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాన రహదారులపై బారికేడ్లు నిర్మించి, రాకపోకలను అడ్డుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అధ్యక్ష భవనం, పరిసర ప్రాంతాలలో భద్రతా దళాలను మోహరించారు. ఇంతలో ప్రస్తుత అధ్యక్షుడు ఒమర్ సిసోకో ఎంబాలో ఎక్కడ ఉన్నారో తెలియకపోవడం రాజకీయ అనిశ్చితికి మరింత ఆజ్యం పోసింది.
READ MORE: Haryana: మరో దేశద్రోహి.. పాకిస్థాన్ “ISI”కి రహస్య సమాచారం అందించిన న్యాయవాది!
ఆదివారం జరిగిన ఎన్నికల తర్వాత ప్రముఖ అభ్యర్థులు ఎంబాలావో, ప్రతిపక్ష నాయకుడు ఫెర్నాండో డయాస్ ఇద్దరూ విజయం సాధించామని ఎవరికి వారు ప్రకటించుకున్నారు. గురువారం అధికారిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇంతలోనే రాజకీయ అస్థిరత ఏర్పడింది. గినియా-బిస్సావు దేశం ఇప్పటికే సంస్థాగత అపనమ్మకం, అధికార పోరాటాలు, ఎన్నికల ప్రక్రియపై వివాదాలను ఎదుర్కొందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన PAIGCని సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయకుండా తాజా ప్రభుత్వం నిషేధించింది. దీంతో ప్రతిపక్షం ఉద్యమాన్ని ప్రారంభించింది. కాగా.. 1974లో పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందిన గినియా-బిస్సావు నాలుగు తిరుగుబాట్లను చవిచూసింది. సుమారు రెండు మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం పేదరికం, బలహీనమైన పాలన, అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రసిద్ధి చెందింది. ఇవే రాజకీయ అస్థిరతకు కారణమయ్యాయి.
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!