Guinea-Bissau: మరో ఆఫ్రికన్ దేశంలో తిరుగుబాటు! అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guinea-Bissau: ఆఫ్రిక ఖండంలోని మరో దేశంలో తిరుగుబాటు చోటు చేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా-బిస్సావు దేశంలో అకస్మాత్తుగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ తీసుకున్నట్లు సైనిక అధికారులు ప్రకటించారు. సైన్యం తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి, దేశ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. సరళంగా చెప్పాలంటే.. మరొక ఆఫ్రికన్ దేశం కూలిపోయింది. గినియా-బిస్సావు దేశం చిన్నదైనప్పటికీ రాజకీయంగా అస్థిరం ఆ దేశాన్ని పట్టి పీడించింది.
READ MORE: Hong Kong: హాంగ్ కాంగ్లో ఘోర విషాదం.. 44 మంది సజీవదహనం
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
అధ్యక్ష పదవి, పార్లమెంటు ఎన్నికలు జరిగిన మూడు రోజులకే ఈ సంఘటన జరిగింది. రాజధాని బిస్సావులోని అధ్యక్ష భవనం సమీపంలో మధ్యాహ్నం భారీ కాల్పులు జరిగాయి. దీంతో సైనిక దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. చాలా మంది పౌరులు భయంతో నగరం నుంచి పారిపోవడం కనిపించింది. కాలినడకన, వాహనాల ద్వారా దేశ విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాన రహదారులపై బారికేడ్లు నిర్మించి, రాకపోకలను అడ్డుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అధ్యక్ష భవనం, పరిసర ప్రాంతాలలో భద్రతా దళాలను మోహరించారు. ఇంతలో ప్రస్తుత అధ్యక్షుడు ఒమర్ సిసోకో ఎంబాలో ఎక్కడ ఉన్నారో తెలియకపోవడం రాజకీయ అనిశ్చితికి మరింత ఆజ్యం పోసింది.
READ MORE: Haryana: మరో దేశద్రోహి.. పాకిస్థాన్ “ISI”కి రహస్య సమాచారం అందించిన న్యాయవాది!
ఆదివారం జరిగిన ఎన్నికల తర్వాత ప్రముఖ అభ్యర్థులు ఎంబాలావో, ప్రతిపక్ష నాయకుడు ఫెర్నాండో డయాస్ ఇద్దరూ విజయం సాధించామని ఎవరికి వారు ప్రకటించుకున్నారు. గురువారం అధికారిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇంతలోనే రాజకీయ అస్థిరత ఏర్పడింది. గినియా-బిస్సావు దేశం ఇప్పటికే సంస్థాగత అపనమ్మకం, అధికార పోరాటాలు, ఎన్నికల ప్రక్రియపై వివాదాలను ఎదుర్కొందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన PAIGCని సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయకుండా తాజా ప్రభుత్వం నిషేధించింది. దీంతో ప్రతిపక్షం ఉద్యమాన్ని ప్రారంభించింది. కాగా.. 1974లో పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందిన గినియా-బిస్సావు నాలుగు తిరుగుబాట్లను చవిచూసింది. సుమారు రెండు మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం పేదరికం, బలహీనమైన పాలన, అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రసిద్ధి చెందింది. ఇవే రాజకీయ అస్థిరతకు కారణమయ్యాయి.
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!