ఇజ్రాయెల్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా మాటలను లెక్కచేయకుండా గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ కు వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ ను నిలిపేసినట్లు సమాచారం.
దేశంలోనే తొలి ప్రైవేటు రైలు జూన్ 4 న పట్టాలేక్కనుంది. కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది.
బీజేపీ ఎంపీ అభ్యర్థి, బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ మరోసారి మోడీ పాలనను ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనారనౌత్.. మండి సెగ్మెంట్లోని ఝకారీ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ట్రాన్స్ మహిళ నివేత (20), చిన్నదురై అనే దళిత విద్యార్థి ఉత్తీర్ణత సాధించారు. తిరునల్వేలి జిల్లాకు చెందిన చిన్నదురై 78 శాతం మార్కులు సాధించగా.. నివేత 47.1 శాతం మార్కులు సాధించింది. వీరిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి సమక్షంలో తన ఛాంబర్లో నివేత, చిన్నదురైను ఘనంగా సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, ప్రధాన కార్యదర్శి శివదాస్ […]
పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి బయటకు దూకిన సిబ్బంది ప్రాణాలు దక్కించుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని బేతుల్ జిల్లా గౌలా గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర మే 10 నుంచి మొదలు కానుంది. యాత్రంలో భాగంగా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని సందర్శించొచ్చు.
స్తుతం ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఉదయం లేవగానే బ్రెస్ కంటే మొదట ఫోన్ ను పట్టుకుంటున్నాం. కాని షావోమీ, రెడ్మీ, పోకో ఫోన్లు వాడుతున్న వారికి ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు.
శంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ వేసవిలో బెంగళూరులో నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడికి జనాలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు బయపడే పరిస్థితి నెలకొంది.కాగా.. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి భిన్నంగా మారింది.
ఈ రోజు లోక్సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. మూడో దశ ఓటింగ్ లో రాష్ట్రం కూడా ఉంది. తన కుటుంబంతో సహా అహ్మదాబాద్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సామాన్య పౌరుడిలా వరుసలో నిలబడి ఓటు వేశారు.