J-K: కశ్మీర్ లో భారీగా భద్రతా దళాల మోహరింపు..ఉగ్రవాదులపై ఉక్కుపాదం
- అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోతున్న కశ్మీర్
- పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి
- ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు అప్రమత్తమైన నిఘా వర్గాలు
- దోడా అడవుల్లో 500 మంది పారా స్పెషల్ కమాండోల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పాటు ఉగ్రవాదులు దాగి ఉన్నారని అనుమానిస్తున్న దోడా అడవుల్లో 500 మంది పారా స్పెషల్ కమాండోలను మోహరించారు. ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం ఇప్పుడు పూర్తి వ్యూహం రచించింది.
READ MORE: Bhatti Vikramarka: అడవులు, జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టండి.. అధికారులకు ఆదేశం
Also Read
అలర్ట్ మోడ్లో సైన్యం…
హై ట్రెండ్ పాక్ ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా జమ్మూ ప్రాంతం అలర్ట్ మోడ్లోకి వచ్చింది. పాక్ నుంచి ప్రవేశించిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్స్ కమాండోలను ఆ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో నిఘా సంస్థలు కూడా తమ యంత్రాంగాన్ని పటిష్టం చేశాయి. టెర్రరిస్టులకు మద్దతిచ్చే ఓవర్గ్రౌండ్, తదితర పరికరాను మట్టుబట్టేందుకు భద్రతా బలగాలు పని చేస్తున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ దురాక్రమణను ఎదుర్కోవడానికి సైన్యం ఇప్పటికే దాదాపు 3,500-4000 మంది భద్రతా సిబ్బందితో కూడిన బ్రిగేడ్తో సహా దళాలను ఈ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
READ MORE: Train Accident: వీడిన దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..
4000 మంది భద్రతా సిబ్బందితో కూడిన బ్రిగేడ్..
గత కొన్ని నెలలుగా జమ్మూ ప్రాంతంలో అనేక పెద్ద దాడులు జరిగాయని తెలిసిందే. జులై 8న జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లా మచెడి ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO)తో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అదే సమయంలో.. గత నెల జూన్ 9 న, జమ్మూలోని శివఖోడిలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 9 మంది మరణించారు. ఈ ఘటనల తర్వాత భద్రతా దళాలు ఈ చర్యకు పూనుకున్నాయి.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?