Mahindra Thar Roxx : భారత మార్కెట్లోకి 5 డోర్స్ మహీంద్రా థార్.. తేదీ విడుదల..
- ఆఫ్ రోడర్స్ ఎస్యూవీ కార్ల తయారీలో మహీంద్రా థార్ కు ప్రత్యేక స్థానం
- ప్రస్తుతం కేవలం 3-డోర్ తో మాత్రమే అందుబాటులో ఉన్న థార్
- 5 డోర్స్ మహీంద్రా థార్ ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టున్న కంపెనీ
- 5-డోర్స్ కారుకు థార్ రోక్స్ అని పేరు ప్రకటించిన కంపెనీ
- 15 ఆగస్ట్ న మార్కెట్లో అడుగు పెట్టనున్న థార్ రోక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ రోడర్స్ ఎస్యూవీ కార్ల తయారీలో మహీంద్రా థార్ అత్యంత పాపులర్గా నిలిచింది. ప్రస్తుతం థార్ కేవలం 3-డోర్ తో మాత్రమే అందుబాటు లో ఉంది. ఈ కార్లు విక్రయాల్లో దూసుకుపోతున్నాయి. 2023-24లో 65,246 యూనిట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో 17,286 యూనిట్ల అమ్ముడయ్యాయి. ఆఫ్-రోడ్ ఎస్యూవీ కార్ల సెగ్మెంట్లో దేశంలోనే రెండో స్థానంలో థార్ కొనసాగుతోంది. తాజాగా మహీంద్ర కంపెనీ 5 డోర్స్ మహీంద్రా థార్ ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. నేడు ఆ నూతన కార్ కి సంబంధించి పేరు, వీడియో విడుదల చేసింది కంపెనీ..దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
READ MORE: Tummala Nageswara Rao: రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు..
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
మహీంద్రా మరియు మహీంద్రా థార్ 5-డోర్ల వెర్షన్కు “థార్ రోక్స్” అని పేరుపెట్టింది. మహీంద్రా థార్ రోక్స్ 15 ఆగస్ట్ 2024న తన ఎంట్రీని ఇవ్వబోతోందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం రోజున మహీంద్రా థార్ రాక్స్ను పరిచయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. 3-డోర్ థార్తో పోలిస్తే దీనికి అనేక ప్రధాన డిజైన్ అప్డేట్లు ఇవ్వబడినట్లు విడుదలైన కంపెనీ రిలీజ్ చేసిన టీజర్లో చూడవచ్చు. కారు ముందు భాగంలో వృత్తాకార ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడి ఉంది.
READ MORE:Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు.. చిక్కుకుపోయిన 4000 మంది..
మరోవైపు.. మహీంద్రా థార్ రోక్స్లో డ్యూయల్ పేన్ సన్రూఫ్, కొత్త ఇంటీరియర్ థీమ్తో పాటు 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్తో సహా అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఎక్స్యూవీ300, ఎక్స్యూవీ700 మోడల్ కార్ల మాదిరిగా పనోరమిక్ సన్ రూఫ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) సిస్టమ్ ఉంటాయి. 5-డోర్ థార్ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. వాటిల్లో ఒకటి 1.5 లీటర్ల డీ117 సీఆర్డీఈ డీజిల్, 2.2 లీటర్ల ఎంహవాక్ 130 సీఆర్డీఈ డీజిల్, 2.0 లీటర్ల ఎంస్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉంటాయని వార్తలోస్తున్నాయి. మహీంద్రా థార్ 5-డోర్ యూనిట్ ధర రూ.12.50 లక్షల నుంచి రూ.18.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
-
The Odyssey: రిలీజ్కు ముందే సెన్సేషన్.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!