Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
- రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాలు
- పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. ప్రమాదం
- పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో ఘటన
- మంత్రి కారును వెనుక నుంచి ఢీకొట్టిన కాన్వాయ్ లోని మరోకారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్లో పర్యటిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. పిలిభిత్లో మంత్రి కాన్వాయ్లోని మరో ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జితిన్ ప్రసాద్ క్షేమంగా ఉన్నారు. ఘటన అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనంలో కేంద్రమంత్రి కార్యక్రమానికి బయలుదేరారు.
READ MORE: Minister Savitha: బీసీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు..
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
ఈ సంఘటన పిలిభిత్లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో చోటుచేసుకుంది. కాన్వాయ్కి ఎస్కార్ట్గా ఉన్న కారు సడన్గా బ్రేకులు వేసింది. ఆ తర్వాత జితిన్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ కూడా బ్రేకు వేశాడు. దీంతో వెనకున్న మరో కారు మంత్రి కారును ఢీకొట్టింది. వాహనం వేగం అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా కాన్వాయ్ మొత్తం ఆగిపోవడంతో జితిన్ ప్రసాద్ తన కారులోంచి బయటకు వచ్చి తన కారును అక్కడే వదిలేసి మరో కారులో ముందుకు సాగారు.
READ MORE:Bangladesh: ఉద్రిక్తంగా బంగ్లాదేశ్.. ప్రపంచానికి దూరంగా ఆ దేశం..
ఉప్పొంగిన దేవా నది.. సమీక్షకు మంత్రి పయణం
దేవా నదిలో నానక్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పిలిభిత్కి వరద పోటెత్తింది. పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న బేణి చౌదరి మరియు ఫీల్ఖానా ప్రాంతాలు ద్వీపాలుగా మారాయి. దీంతో ప్రజలు ఇళ్లపైనే తలదాచుకోవాల్సి వస్తోంది. సోమ, మంగళవారాల్లో ఒక్కసారిగా నదిలో నీరు రావడంతో ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలోపే వారి ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం, పరిపాలన ద్వారా సహాయక మరియు సహాయక చర్యలు జరుగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!