Reliance Jio: చైనా కంపెనీని వెనక్కి నెట్టిన జియో!.. డెటా వినియోగంలో ప్రపంచంలోనే నంబర్ వన్..
- మరో రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో
- ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ గా నిలిచిన కంపెనీ
- చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసిన జియో
- దాదాపు 13 కోట్లకు చేరిన 5G కస్టమర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసింది. రిలయన్స్ జియో యొక్క జూన్ త్రైమాసిక గణాంకాలు తాజాగా వెల్లడించింది. అందులో కంపెనీ డేటా వినియోగం 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాది గణాంకాలతో పోలిస్తే ఈ సారి 33 శాతం పెరిగింది. దేశంలోని కస్టమర్లు రోజూ సగటున 1జీబీ (GB) కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్న ఏకైక కంపెనీగా జియో అవతరించింది.
READ MORE: Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారు..
Also Read
- KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
జియో కస్టమర్లు 5G డేటాను విరివిగా ఉపయోగిస్తున్నారు. పెద్ద మొత్తంలో డేటాను ఉపయోగించే 5G కస్టమర్ల సంఖ్య దాదాపు 13 కోట్లకు చేరింది. అయితే.. 5G ఇప్పటికీ వినియోగదారులకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా అందుబాటులో ఉంది. అర్హత కలిగిన కస్టమర్లు 4G డేటా ప్లాన్తో రీఛార్జ్పై అపరిమిత 5G డేటాను కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం జియోకు 49 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. గత సంవత్సరంలోనే కంపెనీ 4 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకుంది.
READ MORE: Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 3 ఏళ్లలో 3 వైకల్య సర్టిఫికేట్లు..
మొబైల్ వినియోగదారులే కాదు.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ పరంగా కూడా కంపెనీ రికార్డులు సృష్టించింది. 10 లక్షలకు పైగా ఇళ్లు మరియు ప్రాంగణాలకు ఎయిర్ఫైబర్ను అందించిన మొదటి టెలికాం కంపెనీగా జియో అవతరించింది. ఇంటర్నెట్తో పాటు, జియో వినియోగదారులు వాయిస్ కాలింగ్లో కూడా ముందున్నారు. జూన్ త్రైమాసికంలో వాయిస్ కాలింగ్ విషయంలో కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇప్పుడు రికార్డు స్థాయి 1.42 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది.
READ MORE:Rammohan Naidu: రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరం.. నిధులను ఏపీకి రప్పిస్తాం..
డిజిటల్ ఇండియాకు వెన్నెముక, అధిక కవరేజీతో సరసమైన ఇంటర్నెట్ అందిస్తున్న సంస్థ జియో అని కంపెనీ ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ ఎం అంబానీ అన్నారు. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు, 5G సేవలు, AI సెక్టార్లో ఆవిష్కరణ వృద్ధిని పెంచుతాయన్నారు. రాబోయే కాలంలో జియో మెరుగైన నెట్వర్క్, సేవల ఆధారంగా మార్కెట్లో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!