Reliance Jio: చైనా కంపెనీని వెనక్కి నెట్టిన జియో!.. డెటా వినియోగంలో ప్రపంచంలోనే నంబర్ వన్..
- మరో రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో
- ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ గా నిలిచిన కంపెనీ
- చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసిన జియో
- దాదాపు 13 కోట్లకు చేరిన 5G కస్టమర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసింది. రిలయన్స్ జియో యొక్క జూన్ త్రైమాసిక గణాంకాలు తాజాగా వెల్లడించింది. అందులో కంపెనీ డేటా వినియోగం 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాది గణాంకాలతో పోలిస్తే ఈ సారి 33 శాతం పెరిగింది. దేశంలోని కస్టమర్లు రోజూ సగటున 1జీబీ (GB) కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్న ఏకైక కంపెనీగా జియో అవతరించింది.
READ MORE: Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారు..
Also Read
- Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
- Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
- Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ 'లాక్డౌన్' లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
జియో కస్టమర్లు 5G డేటాను విరివిగా ఉపయోగిస్తున్నారు. పెద్ద మొత్తంలో డేటాను ఉపయోగించే 5G కస్టమర్ల సంఖ్య దాదాపు 13 కోట్లకు చేరింది. అయితే.. 5G ఇప్పటికీ వినియోగదారులకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా అందుబాటులో ఉంది. అర్హత కలిగిన కస్టమర్లు 4G డేటా ప్లాన్తో రీఛార్జ్పై అపరిమిత 5G డేటాను కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం జియోకు 49 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. గత సంవత్సరంలోనే కంపెనీ 4 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకుంది.
READ MORE: Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 3 ఏళ్లలో 3 వైకల్య సర్టిఫికేట్లు..
మొబైల్ వినియోగదారులే కాదు.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ పరంగా కూడా కంపెనీ రికార్డులు సృష్టించింది. 10 లక్షలకు పైగా ఇళ్లు మరియు ప్రాంగణాలకు ఎయిర్ఫైబర్ను అందించిన మొదటి టెలికాం కంపెనీగా జియో అవతరించింది. ఇంటర్నెట్తో పాటు, జియో వినియోగదారులు వాయిస్ కాలింగ్లో కూడా ముందున్నారు. జూన్ త్రైమాసికంలో వాయిస్ కాలింగ్ విషయంలో కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇప్పుడు రికార్డు స్థాయి 1.42 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది.
READ MORE:Rammohan Naidu: రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరం.. నిధులను ఏపీకి రప్పిస్తాం..
డిజిటల్ ఇండియాకు వెన్నెముక, అధిక కవరేజీతో సరసమైన ఇంటర్నెట్ అందిస్తున్న సంస్థ జియో అని కంపెనీ ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ ఎం అంబానీ అన్నారు. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు, 5G సేవలు, AI సెక్టార్లో ఆవిష్కరణ వృద్ధిని పెంచుతాయన్నారు. రాబోయే కాలంలో జియో మెరుగైన నెట్వర్క్, సేవల ఆధారంగా మార్కెట్లో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!