Chirag Paswan: యూనిఫాం సివిల్ కోడ్ పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..మద్దతు ఇవ్వను..!
- దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
- ‘యూనిఫాం సివిల్ కోడ్ పై ఎన్డీఏలో ఇప్పటివరకు చర్చ జరగలేదన్న మంత్రి
- యూసీసీ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన చిరాగ్
- భారత్ భిన్నత్వం కలిగిన దేశమని అందరినీ ఒకే గొడుగు కిందికి ఎలా తీసుకొస్తారని ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించారు. అయితే ఈ లెక్కలను బహిరంగపరచడం వల్ల సమాజంలో ‘విభజన’ ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’, ‘యూనిఫాం సివిల్ కోడ్’పై అధికార ఎన్డీఏలో ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే..ఈ రెండు అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో భాగమే.
Also Read
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ఓ వార్తా సంస్థతో ప్రత్యేక సంభాషణలో యూసీసీ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ముసాయిదాను తన ముందు ఉంచనంత వరకు తాను ఎలాంటి స్టాండ్ తీసుకోలేనని ఆయన తెలిపారు. అయితే.. తన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’కు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి మద్దతిస్తారా అని పాశ్వాన్ను అడిగినప్పుడు? అందుకే ఆయన స్పందిస్తూ.. “మా దగ్గర ఇంకా ముసాయిదా లేదు. ఆ ముసాయిదా చూసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. ఇప్పటికే ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి.” అని సమాధానమిచ్చారు.
READ MORE:Srisailam Project: శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు.. భారీగా పెరిగిన వరద ప్రవాహం
ఈ అంశంపై ఇంకా మాట్లాడుతూ.. “భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. అది భాష, సంస్కృతి లేదా జీవనశైలి కావచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. అందరినీ ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకురాగలరు. అయితే..యూసీసీ అమలు చేస్తే.. ముస్లింలకే నష్టం అన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అది హిందువులపై కూడా దీని ప్రభావం పడవచ్చు. ఎందుకంటే వివాహానికి సంబంధించిన విషయాలు, పలు ఆచారాలు మరియు సంప్రదాయాలు దేశవ్యాప్తంగా భిన్నంగా ఉంటాయి.” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో గిరిజనులను ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకువస్తారు? కాబట్టి డ్రాఫ్ట్ వచ్చే వరకు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!