Chirag Paswan: యూనిఫాం సివిల్ కోడ్ పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..మద్దతు ఇవ్వను..!
- దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
- ‘యూనిఫాం సివిల్ కోడ్ పై ఎన్డీఏలో ఇప్పటివరకు చర్చ జరగలేదన్న మంత్రి
- యూసీసీ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన చిరాగ్
- భారత్ భిన్నత్వం కలిగిన దేశమని అందరినీ ఒకే గొడుగు కిందికి ఎలా తీసుకొస్తారని ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించారు. అయితే ఈ లెక్కలను బహిరంగపరచడం వల్ల సమాజంలో ‘విభజన’ ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’, ‘యూనిఫాం సివిల్ కోడ్’పై అధికార ఎన్డీఏలో ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే..ఈ రెండు అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో భాగమే.
Also Read
- NEET Exam: రేపే నీట్ ఎగ్జామ్.. ఈసారైనా పగడ్బందీగా జరిగేనా?
- Rohit Sharma: హిట్మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
- Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
ఓ వార్తా సంస్థతో ప్రత్యేక సంభాషణలో యూసీసీ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ముసాయిదాను తన ముందు ఉంచనంత వరకు తాను ఎలాంటి స్టాండ్ తీసుకోలేనని ఆయన తెలిపారు. అయితే.. తన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’కు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి మద్దతిస్తారా అని పాశ్వాన్ను అడిగినప్పుడు? అందుకే ఆయన స్పందిస్తూ.. “మా దగ్గర ఇంకా ముసాయిదా లేదు. ఆ ముసాయిదా చూసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. ఇప్పటికే ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి.” అని సమాధానమిచ్చారు.
READ MORE:Srisailam Project: శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు.. భారీగా పెరిగిన వరద ప్రవాహం
ఈ అంశంపై ఇంకా మాట్లాడుతూ.. “భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. అది భాష, సంస్కృతి లేదా జీవనశైలి కావచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. అందరినీ ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకురాగలరు. అయితే..యూసీసీ అమలు చేస్తే.. ముస్లింలకే నష్టం అన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అది హిందువులపై కూడా దీని ప్రభావం పడవచ్చు. ఎందుకంటే వివాహానికి సంబంధించిన విషయాలు, పలు ఆచారాలు మరియు సంప్రదాయాలు దేశవ్యాప్తంగా భిన్నంగా ఉంటాయి.” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో గిరిజనులను ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకువస్తారు? కాబట్టి డ్రాఫ్ట్ వచ్చే వరకు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
NEET Exam: రేపే నీట్ ఎగ్జామ్.. ఈసారైనా పగడ్బందీగా జరిగేనా?
-
Rohit Sharma: హిట్మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
-
APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
-
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
-
Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!