Puja Khedkar: ఒక్క ట్వీట్ తో ఐఏఎస్ పోస్ట్ ఊస్ట్.. ఆ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరంటే.. ?
- చట్టవ్యతిరేక పనులకు పాల్పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్
- సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసిన యువకుడు
- చర్చనీయాంశంగా మారిన అంశం
- స్పందించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
- ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ చేసిన చట్టవ్యతిరేక పనులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కదిలించింది. దీనిపై ప్రధాని కార్యాలయం దృష్టి సారించింది. ఇప్పుడు పూజా ఖేద్కర్ ఉద్యోగం ప్రమాదంలో పడింది. యూపీఎస్సీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయం తొలిసారిగా ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసా? పూజా ఖేద్కర్ ఆడి కారు చిత్రాన్ని మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు జనాలు ఎదురుచూస్తున్నారు. ఐఏఎస్ పూజా ఖేద్కర్ను రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి పేరు వైభవ్ కోకట్. పూజా ఖేద్కర్ ఆడి కారు డిమాండ్ చేసిన విషయాన్ని తొలిసారి సోషల్ మీడియా ద్వారా అందరి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే. సోషల్ మీడియా పవర్ని అర్థం చేసుకున్న వైభవ్.. ఓ ట్వీట్ చేయడం వల్ల ఓ ఐఏఎస్ అధికారి పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది.
READ MORE: Damodara Rajanarsimha: నగదు రహిత చెల్లింపుల రద్దు నిర్ణయం ఉపసంహరణ..
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
జులై 6న ‘X’లో పూజా ఖేద్కర్ గురించిన సమాచారాన్ని ఫోటోతో పాటు పోస్ట్ చేశాడు వైభవ్. ఆ తర్వాత క్షణాల్లో వైరల్గా మారింది. ఆ పోస్ట్ను మీడియా దృష్టికి తీసుకెళ్లింది. దీని తర్వాత వైభవ్కు సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ (RTI) కార్యకర్తల నుంచి కాల్స్ వచ్చాయి. అప్పుడు పూజా ఖేద్కర్ గురించి మరింత సమాచారం బయటకి రావడం మొదలైంది. ఈ ఘటన తర్వాత పలువురు ఐఏఎస్ అధికారులు తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు.
READ MORE:Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
వైభవ్ కోకట్ ఎవరు?
వైభవ్ బీడ్ జిల్లా కోకట్ నివాసి. సామాజిక, రాజకీయ అంశాలపై రాయడం ఆయనకు ఇష్టం. పీఆర్ కంపెనీలో కూడా పనిచేశాడు. ఎక్స్ లో అతనికి 31 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఒక రోజు ముందు.. జూలై 19 న పోలీసులు ఖేద్కర్పై కేసు నమోదు చేసినప్పుడు దీనిపై కూడా వైభవ్ మరొక పోస్ట్ చేశారు. “ఓ పోస్టుకు చాలా పవర్ ఉంది.. అన్యాయాన్ని ధైర్యంగా రాయండి. వ్యవస్థకు వ్యతిరేకంగా అన్యాయాన్ని నిలదీయండి. వ్యవస్థను సైతం వంచే శక్తి మీ రచనకు ఉంది.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!