Train Accident: వీడిన దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..
- చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు
- ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందన్న లోకోపైలెట్
- రైలు ట్రాక్లో లోపం కారణంగా ప్రమాదం
- 2:30 గంటలకు స్టేషన్ మాస్టర్కు విషయం తెలిసింది
- ఈ రైలు మధ్యాహ్నం 2:28 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు
- రెండు నిమిషాల నిర్లక్ష్యం ఇంత పెద్ద ప్రమాదానికి కారణం
గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి కుట్ర లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ప్రమాదం అనంతరం లోకో పైలట్కు సంచలన విషయం వెల్లడించారు. ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందని తెలిపారు. దీంతో ప్రమాద ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ పేలుడు శబ్ధం వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ట్రాక్ నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇంజినీరింగ్ విభాగాన్ని హెచ్చరించినట్లు ఉమ్మడి నివేదికలో చెప్పబడింది. అధికారుల రెండు నిమిషాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. రెండు నిమిషాలు నలుగురి ప్రాణాలను, మరెంతో మందిని క్షతగాత్రులను చేశాయి. ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం వచ్చింది. ఎందరో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది.
READ MORE: Tirumala: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..
Also Read
స్టేషన్ మాస్టర్కి ఆలస్యంగా హెచ్చరిక వచ్చింది..
ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఈ రైలు మధ్యాహ్నం 2:28 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే 2:30 గంటలకు స్టేషన్ మాస్టర్కు 30 kmph వేగ పరిమితిని నిర్ధారించాలని, వేగంగా వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేయబడింది. హెచ్చరిక ఆర్డర్ ప్రకారం.. రైలు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు. అయితే స్టేషన్మాస్టర్కు హెచ్చరిక అందే సమయానికి రైలు ట్రాక్లో లోపం ఉన్న ప్రదేశానికి చేరుకుంది. 2:32 గంటలకు రైలు కోచ్లు పట్టాలు తప్పాయని ఉమ్మడి నివేదికలో కూడా రాశారు. రైలు 2:28కి స్టేషన్ దాటడానికి 2 నిమిషాల ముందే స్టేషన్ మాస్టర్కు హెచ్చరిక అందజేసి ఉంటే.. బహుశా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని నివేదికలో స్పష్టమైంది. ట్రాక్లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాక్లో కొంత అవాంతరాలున్నట్లు పట్టాలు తప్పినందుకు సంబంధించిన ఉమ్మడి నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. 350 మీటర్ల మేర ట్రాక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
-
RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
-
Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..
-
AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
-
US: ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!