Diabetes Cases in 2024: భారత్లో వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవన శైలి, కల్తీ ఆహారంతో కొత్త వ్యాధులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే.. భారత్లో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఓ రిపోర్టు అందరిని మరోసారి అప్రమత్తం చేసింది. 2024లో ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న పెద్దల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్లో దాదాపు 9 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారని ‘ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రినాలజీ’ జర్నల్లో…
Hyderabad: పండగ పూట హైదరాబాద్ నాచారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించే క్రమంలో జరిగిన చిన్న గొడవ అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారి తీసింది. మద్యం గ్లాస్ విషయంలో మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో తమ్ముడు అన్నపై దాడికి పాల్పడ్డాడు.
Priya Kapoor: దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ రెండో భార్య ప్రియా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2016లో నటి కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ మధ్య విడాకులు జరిగిన విషయం తెలిసిందే. ఈ విడాకుల కేసుకు సంబంధించిన పత్రాల ధృవీకృత ప్రతులు ఇవ్వాలని ప్రియా కోర్టును కోరారు. ఈ పత్రాల్లో విడాకుల సమయంలో కుదిరిన రాజీ వివరాలు, పిల్లల సంరక్షణ ఎలా ఉండాలనే అంశాలపై సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇంజంక్షన్పై ఉత్తర్వులను రిజర్వ్ చేయడానికి మూడు రోజుల ముందు, గత నవంబర్ చివర్లో…
MP Arvind: శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ని ఇందూర్గా పేర్కొన్న ఆయన.. ఆ పేరు ఎలా వచ్చిందో చారిత్రిక ఆధారాలు ఉన్నాయన్నారు. తాజాగా మీడియాలో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఒక హంతకుడు.. నిజామాబాద్కి ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారన్నారు. ఇందూర్గా పేరు మార్చి ఆ తీర్మానాన్ని ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్రెడ్డికి పంపిస్తామన్నారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్…
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాకిస్థాన్ అనుమానిత డ్రోన్ల చొరబాటు కలకలం రేపుతోంది. తాజాగా రామ్గఢ్ సెక్టార్లోని కేసో మహాన్సన్ గ్రామం సమీపంలో డ్రోన్లు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్స్ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, పూంచ్ జిల్లాలోని డేగ్వార్ గ్రామం మీద కూడా డ్రోన్ లాంటి వస్తువు కనిపించింది. దాదాపు 10 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. సాయంత్రం 7.30 గంటల సమయంలో గుర్తించిన ఈ డ్రోన్స్ను…
Indian Army Day 2026: ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైన్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 1949లో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప భారత సైన్యానికి తొలి భారతీయ సర్వాధికారిగా బాధ్యతలు స్వీకరించిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఈ రోజున ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం తన రక్షణ వ్యవస్థపై సంపూర్ణ నియంత్రణ సాధించిన సంకేతంగా ఈ రోజు నిలిచింది.
BMC Election Exit Polls: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి విజయం దాదాపు ఖరారైనట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన ఈ మున్సిపల్ సంస్థలో మొత్తం 227 వార్డులు ఉండగా, బీజేపీ–శివసేన కలిసి 130కిపైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ–శివసేన కూటమికి 131 నుంచి 151 సీట్లు రావొచ్చు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి 138 వార్డులు దక్కించుకుంటుందని అంచనా వేసింది. ఏడు సంవత్సరాల…
AR Rahman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ రోజు బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన మ్యూజిక్ కంపోజర్లలో ఒకరిగా నిలిచారు. హిందీ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకోవడానికి ఆయనకు దాదాపు ఏడేళ్లు పట్టింది. ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహమాన్ మాట్లాడుతూ.. మొదట్లో బాలీవుడ్లో తను బయటి వాడిలా భావించారని చెప్పారు. ‘రోజా’, ‘బాంబే’, ‘దిల్ సే’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికీ.. హిందీ చిత్రసీమలో భాగమన్న భావన కలగలేదన్నారు.…
Harsha Richaria: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నివసిస్తున్న హర్షా రిచారియా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె స్వస్థలం మాత్రం ఉత్తరాఖండ్. మహాకుంభ్ 2025 సమయంలో ఆమె పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆమె తీసుకున్న కొత్త నిర్ణయం మళ్లీ సంచలనం రేపుతోంది. ఇన్స్టాగ్రామ్లో తాజాగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఈ భావోద్వేగ వీడియోలో హర్షా, తాను ధార్మిక మార్గం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. గత ఏడాది కాలంగా నిరంతర విమర్శలు, వ్యక్తిత్వ హననం, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నానని చెప్పారు.…
Indian Army Day 2026: ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైన్య దినోత్సవం (Indian Army Day)ను ఘనంగా జరుపుకుంటాం. భారత సైనిక చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకునే రోజే ఇది. 1949 జనవరి 15న ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కారియప్ప భారత సైన్యానికి తొలి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సంఘటన భారత స్వాతంత్ర్యం తర్వాత రక్షణ రంగంలో దేశం స్వయంప్రతిపత్తి సాధించిన ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అప్పటి నుంచి ఏటా ఆర్మీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నేడు…