BMC Election Results: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ముంబై రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మొత్తం 227 వార్డుల ఫలితాలు ప్రకటించగా, దాదాపు 25 ఏళ్లుగా ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న BMCలో ఈసారి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ–షిండే శివసేన కూటమి కలిసి మొత్తం 118 సీట్లు గెలుచుకుంది. అధికారానికి అవసరమైన మెజారిటీ 114 సీట్లు కాగా, కూటమి ఆ సంఖ్యను నాలుగు సీట్ల తేడాతో దాటింది. 2017లో కేవలం 82 సీట్లకే…
Mauni Amavasya 2026: ఈ ఏడాది మాఘ మాసంలో వచ్చే మౌనీ అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆదివారం సూర్యుడికి అంకితమైన రోజు కావడంతో ఆధ్యాత్మికంగా ఈ రోజు శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మకం. మౌనీ అమావాస్య రోజున స్నానం, దానం, పూజ, ధ్యానం చేయడం, మనసును శుద్ధి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. మాఘ అమావాస్యను మాఘీ అమావాస్య లేదా మౌనీ అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి దానధర్మాలు…
BMC Elections: దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనిక, అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా పేరున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో (బీఎంసీ) తొలిసారి బీజేపీ మేయర్ పదవి దక్కించుకోబోతోంది. కేవలం బీఎంసీ మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థల్లో 25 చోట్ల మహాయుతి ఘన విజయం సాధించింది. ఠాక్రే సోదరులు సహా మొత్తం ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారాయి. ఈ ఎన్నికలతో 25 ఏళ్ల తర్వాత బీఎంసీపై శివసేన పట్టు పూర్తిగా తెగిపోయింది.…
OpenAI: చాట్జీపీటీని ఉచితంగా ఉపయోగిస్తున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. త్వరలో చాట్జీపీటీలో యాడ్స్ ప్రత్యేక్షం కానున్నాయి. ఈ విషయాన్ని ఓపెన్ఏఐ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ప్రకటనలు ప్రారంభం కాలేదని, వచ్చే కొన్ని వారాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపడతామని సంస్థ తెలిపింది. వినియోగదారుల నుంచి ఆదాయం పొందేందుకు ఇది మరో ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రస్తుతం చాట్జీపీటీకి 80 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉచితంగానే సేవలను వినియోగిస్తున్నారు. కంపెనీ విలువ 500 బిలియన్ డాలర్లకు చేరినా, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో లాభాలు…
Tamannaah: తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపూ 15 ఏళ్లు దాటినప్పటికీ క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తమన్నా హీరోయిన్గానే కాదు.. ఐటెం సాంగ్స్లో సైతం ఇరగదీసింది. బాలీవుడ్, టాలీవుడ్లో పలు ఐటెం సాంగ్స్తో అదరగొట్టింది. అయితే.. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక సౌత్ స్టార్ హీరో తనను ఘోరంగా అవమానించాడని వాపోయింది.…
CM Revanth Reddy: రేపు మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి TGSWREIS ఆవరణలో మహబూబ్నగర్ ఐఐఐటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఐఐఐటీ నిర్మాణానికి సంబంధించి నిర్వహించే భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. విద్యా రంగాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
S*exual drive Study: సాధారణంగా పురుషుల్లో శృంగార కోరికలు ఇరవయ్యేళ్ల వయసులోనే ఎక్కువగా ఉంటాయనే భావన ఉంది. కానీ తాజాగా వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఈ ఆలోచనకు భిన్నమైన నిజాన్ని వెల్లడించింది. పురుషులలో ఈ కోరికలు వయసుతో కాకుండా శారీరక-మానసిక పరిపక్వతతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాయని ఈ స్టడీ చెబుతోంది. ముఖ్యంగా నలభయ్యేళ్ల వయసులో పురుషుల సెక్స్ డ్రైవ్ అత్యున్నత స్థాయికి చేరుతుందని పరిశోధకులు గుర్తించారు. ఎస్టోనియాలోని టార్టూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 20 నుంచి 84 ఏళ్ల మధ్య వయసున్న…
CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో ప్రత్యేకమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ కు జరగాల్సిన న్యాయం, చేయాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. పాలమూరు తో సమానంగా ఆదిలాబాద్ జిల్లా కు నిధులు ఇస్తున్నామని చెప్పారు. తాజాగా నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూసేకరణ కు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు వర్శిటీ లేదని.. ఈ ప్రాంతానికి వర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలో వర్సిటీ మంజూరు…
India 5G Users: భారత టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందింది. 5జీ సేవలు ప్రారంభమై కేవలం మూడు ఏళ్లకే ఈ సాంకేతికత కోట్లాది మంది వినియోగదారుల దైనందిన జీవితంలో భాగమైంది. 5జీ విస్తరణలో భారత్ కీలక మైలురాళ్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు, పరిశ్రమ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లను దాటింది. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ […]
Amazon Great Republic Day Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2026 సేల్ ప్రారంభమైంది. ఇది ఈ ఏడాది అమెజాన్ నిర్వహిస్తున్న తొలి పెద్ద డిస్కౌంట్ సేల్. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వేరబుల్స్, కిచెన్ అప్లయన్సెస్, స్మార్ట్ టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారులకు అనేక ఆఫర్లను అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు…