Diabetic Cases: షాకింగ్ రిపోర్ట్.. భారత్లో పెరుగుతున్న “షుగర్” రోగులు.. ప్రపంచంలోనే రెండో స్థానం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes Cases in 2024: భారత్లో వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవన శైలి, కల్తీ ఆహారంతో కొత్త వ్యాధులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే.. భారత్లో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఓ రిపోర్టు అందరిని మరోసారి అప్రమత్తం చేసింది. 2024లో ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న పెద్దల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్లో దాదాపు 9 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారని ‘ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రినాలజీ’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనాలో 14.8 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. మూడో స్థానంలో యూఎస్ ఉంది. అమెరికాలో 3.9 కోట్ల మంది వ్యాధిగ్రస్థులు ఉన్నారు.
READ MORE: Huge Demand for Kosa Meat: ఓడిపోయిన పందెం కోళ్లకు ఫుల్ డిమాండ్..
Also Read
- Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
ఈ పరిశోధనలో బెల్జియంలోని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్, చెన్నైలోని ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్, డాక్టర్ ఏ. రామచంద్రన్ డయాబెటీస్ హాస్పిటల్కు చెందిన నిపుణులు పాల్గొన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న చైనా, భారత్, అమెరికా, పాకిస్థాన్ వంటి దేశాల్లో మధుమేహ రోగుల అత్యధికంగా ఉన్నారని తేలింది. భవిష్యత్తులో పాకిస్థాన్ కూడా అమెరికాను దాటి మధుమేహ రోగుల సంఖ్యలో ముందుకు రావచ్చని అంచనా వేశారు. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ విడుదల చేసిన 11వ డయాబెటీస్ అట్లాస్ ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 58.9 కోట్ల మంది పెద్దలకు మధుమేహంతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 85.3 కోట్లకు చేరవచ్చని అంచనా. అంటే ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టే.
READ MORE: Hyderabad: మద్యం గ్లాస్ కోసం ఘర్షణ.. అన్నను చంపిన తమ్ముడు..
ఈ అధ్యయనాన్ని 2005 నుంచి 2024 మధ్య కాలంలో 215 దేశాలు, ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ మధ్య కాలంలో దాదాపు 246 పరిశోధనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో ఉన్న వారిలో సుమారు 80 శాతం మంది అత్యధిక, మధ్య ఆదాయ దేశాల్లోనే ఉన్నారని అంచనా. 2050 నాటికి మధుమేహ కేసుల పెరుగుదలలో 95 శాతం వరకు ఈ దేశాల్లోనే ఉండే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. జనాభా పెరుగుదల, వృద్ధుల సంఖ్య పెరగడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలు మధుమేహం పెరుగుదలకు దోహదపడుతున్నాయని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ మధుమేహం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. 75 నుంచి 79 ఏళ్ల వయస్సు గల పెద్దల్లో దాదాపు 25 శాతం మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో, గ్రామాల కంటే పట్టణాల్లో మధుమేహం ఎక్కువగా ఉందని గుర్తించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!