The Raja Saab Box Office Collection Day 2: ప్రభాస్ నటించిన తాజా హారర్–ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా భారత్లో త్వరలోనే రూ.100 కోట్ల మార్క్ను చేరువకానుంది. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) సమాచారం ప్రకారం.. శుక్రవారం అన్ని భాషల్లో కలిపి రూ.53.75 కోట్లు వసూలు చేసింది. అయితే రెండో రోజు శనివారం వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించింది. దాదాపు 50 శాతం డ్రాప్తో డే…
Urfi Javed Viral Video: ఉర్ఫీ జావేద్ టీవీ ఇండస్ట్రీలో తరచూ ట్రోలింగ్కు గురయ్యే నటీమణుల్లో ఒకరు. ఒకప్పుడు ఆమె వేసుకునే దుస్తులు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపేవి. ఉర్ఫీ ఫొటోలు, వీడియోలు చూసి కొందరు కళ్లే మూసుకునే పరిస్థితి ఉండేది. అయితే కాలక్రమేణా ఆమె కాస్త నిశ్శబ్దంగా మారిందనే అభిప్రాయం ఉంది. కాగా.. మీడియా ముందుకు మాత్రం ఇంకా హంగామా తప్పడం లేదు. ఇటీవల ఉర్ఫీ జావేద్ ఒక ఈవెంట్కు హాజరయ్యింది. ఆ కార్యక్రమంలో ఆమె వేసుకున్న దుస్తులు అంత ప్రత్యేకంగా…
PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సోమనాథుడికి అభిషేకం చేసి దేశ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన ప్రధాని, సోమనాథ్ ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని ఆస్వాదించారు. దీనికి ముందు నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ యాత్రలో సోమనాథ్ ఆలయ చరిత్ర, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ విశిష్టత, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే విధంగా అలంకరించిన…
Recharge Price Hike: సామాన్యులకు మరో బిగ్షాక్ తగిలింది. టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మొబైల్ టారిఫ్లను సుమారు 15 శాతం పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పెంపు 2026 జూన్లో అమలులోకి వచ్చే అవకాశం ఉందని జెఫ్రీస్ నివేదిక వెల్లడించింది. గతంలో జరిగిన ధరల సవరణల ట్రెండ్కు ఇదే సరైన కాలమని ఆ నివేదిక పేర్కొంది. ధరలు పెరగడమే కాకుండా, దేశంలో డేటా వినియోగం వేగంగా పెరగడం,…
Malayalam Language Bill 2025: కేరళ అసెంబ్లీ ఆమోదించిన మలయాళ భాషా బిల్లు 2025పై అనేక అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై తాజాగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పష్టతనిచ్చారు. ఈ బిల్లుపై వ్యక్తమవుతున్న ఆందోళనలు వాస్తవాలకు దూరమన్నారు. ఈ బిల్లుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విజయన్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వం సెక్యులరిజం, బహుళత్వం వంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందని పోస్ట్లో స్పష్టం చేశారు. ఈ బిల్లులో భాషా మైనారిటీల హక్కులను కాపాడేందుకు రక్షణ నిబంధన…
Commander Manoj Katiyar: పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గలేదని, పాకిస్థాన్ కావాలనే యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తోందని వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ తెలిపారు. శాంతి కోసం భారత్ ఎన్నిసార్లు ప్రయత్నించినా, పాకిస్థాన్ స్నేహబంధాలను కోరుకోవడం లేదని అన్నారు. ఢిల్లీలోని మానెక్షా సెంటర్లో జరిగిన వెస్ట్రన్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకలో ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్ సైన్యానికి శాంతి అవసరం లేదని, శాంతి వస్తే తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనే భయంతోనే ఉద్రిక్తతలను పెంచుతున్నారని కటియార్ వ్యాఖ్యానించారు. భారత్తో నేరుగా…
Pakistan Army Terror Links: పాకిస్థాన్ సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య సానిహిత్య సంబంధం ఉందనే విషయం బహిరంగ రహస్యమే. అయితే.. ఈ వాదన మరోసారి బలపడింది. తాజాగా పాకిస్థాన్కు చెందిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి వీడియో వెలుగులోకి వచ్చింది. వైరల్గా మారిన ఈ వీడియోలో పాకిస్థాన్ సైన్యంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను కసూరి బహిరంగంగానే గొప్పగా చెప్పుకున్నాడు. ఈ దృశ్యాలను గూఢచార సంస్థలు ధృవీకరించాయి. వీడియో ఎప్పుడు తీసిందన్నది స్పష్టంగా లేకపోయినా, భారత్కు ఎదురవుతున్న ముప్పును ఇది మరోసారి…
ED vs West Bengal Govt: పశ్చిమ బెంగాల్లో ఈడీ vs బెంగాల్ ప్రభుత్వం వార్ నడుస్తోంది. ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ చేసిన దాడుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని ఈడీ కోరుతోంది. ఇప్పటికే ఈ అంశంపై కలకత్తా హైకోర్టును కూడా ఈడీ ఆశ్రయించగా, ఆ పిటిషన్పై జనవరి 14న విచారణ జరగనుంది.
The Raja Saab: డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. సినిమా థియేటర్లలోకి వచ్చిన 24 గంటల్లోనే ఆన్ లైన్ లో రాజాసాబ్ మూవీ HD ప్రింట్ ప్రత్యేక్షమైంది. ఇప్పటికే టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వ మెమోను నిన్న హైకోర్టు కొట్టేసింది. ఆ దెబ్బ తేరుకోక ముందే రాజాసాబ్ మూవీని పైరసీ చేసి ఆన్లైన్ సైట్లో ప్రత్యక్షం కావడంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై ఓ వైపు.. మూవీ టీం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. ఫ్యాన్స్…
Medaram Jatara: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో…