BMC Election Exit Polls: ముంబై కా రాజా తేలిపోయారు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMC Election Exit Polls: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి విజయం దాదాపు ఖరారైనట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన ఈ మున్సిపల్ సంస్థలో మొత్తం 227 వార్డులు ఉండగా, బీజేపీ–శివసేన కలిసి 130కిపైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ–శివసేన కూటమికి 131 నుంచి 151 సీట్లు రావొచ్చు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి 138 వార్డులు దక్కించుకుంటుందని అంచనా వేసింది. ఏడు సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు తీవ్ర పోటాపోటీగా సాగాయి. మారుతున్న కూటములు, వ్యూహాత్మక కలయికలు, మరాఠీ అస్మితపై పోరు ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.
READ MORE: Se*xual Harassment: బాల్యంలో పదే పదే లైంగిక వేధించారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రముఖ నటి
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఇరవై ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి పోటీ చేసినా ఆశించిన ఫలితం దక్కేలా కనిపించడం లేదు. ఆక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం శివసేన (యూబీటీ)–ఎంఎన్ఎస్ కూటమికి 58 నుంచి 68 సీట్లు రావొచ్చు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ కూటమికి 59 వార్డులు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పింది. చివరి నిమిషంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీతో చేతులు కలిపినా.. కాంగ్రెస్ పరిస్థితి బలహీనంగానే ఉంది. కాంగ్రెస్కు గరిష్ఠంగా 12 నుంచి 16 సీట్లు మాత్రమే దక్కే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ముంబైతో పాటు మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ ఆఘాడీ కూటముల్లోనే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. సిద్ధాంత భేదాలు మసకబారిపోయేలా రాజకీయ సమీకరణాలు మారాయి. శివసేన, ఎన్సీపీ విభజన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే తరహా పరిస్థితి కొనసాగుతోంది. బీఎంసీలో బీజేపీ 137 సీట్లకు, శివసేన 90 సీట్లకు పోటీ చేశాయి. మహాయుతిలోని మరో భాగస్వామి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, బీఎంసీపై బీజేపీ–శివసేన ఆధిపత్యం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
READ MORE: Se*xual Harassment: బాల్యంలో పదే పదే లైంగిక వేధించారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రముఖ నటి
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!