MP Arvind: అవును.. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉంది.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Arvind: శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ని ఇందూర్గా పేర్కొన్న ఆయన.. ఆ పేరు ఎలా వచ్చిందో చారిత్రిక ఆధారాలు ఉన్నాయన్నారు. తాజాగా మీడియాలో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఒక హంతకుడు.. నిజామాబాద్కి ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారన్నారు. ఇందూర్గా పేరు మార్చి ఆ తీర్మానాన్ని ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్రెడ్డికి పంపిస్తామన్నారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు తెలిపారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నారు.. మీ పార్టీకి సున్తీ అయిందా పోయి చూసుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో హిందువులా? ముస్లింలా? అని చూసి కాల్చి చంపారని గుర్తు చేశారు. కొంత మంది హిందువుల్లో చెడ పుట్టారన్నారు. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎక్కడుందో కవితను అడిగితే చెబుతుందన్నారు.. రేపు సిరిసిల్లలో కూడా చూపిస్తామన్నారు. ఇందూర్కి దమ్ముంటే రా అని కేటీఆర్కి సవాల్ విసిరారు.
READ MORE: UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి
Also Read
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
చెన్నారెడ్డి సీఎంగా రాజీనామా చేసే వరకు రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగాయని ఎంపీ అరవింద్ తెలిపారు. “గొడవలకు కారణం కాంగ్రెస్.. అప్పట్లో సత్తయ్య ఏసీపీని చంపితే ఆ నిందితులను బయటకు తెచ్చింది మజ్లిస్.. తిన్న తిండి అరగక హిందూ దేవాలయాల మీద పడుతున్నారు.. దీనికి కారణం రేవంత్ రెడ్డి.. ఇచ్చేది దొంగ వాగ్దానాలు.. హిందూ దేవుళ్ళ మీద ఓట్లు.. గులాంలుగా మారి పోయి హిందువులను తాకట్టు పెడుతున్నారు.. నూటికి నూరు శాతం ఇందూర్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేస్తాం.. నిజామాబాద్ పేరును ఇందూర్గా మారుస్తాం… తీర్మానం చేసి రాష్ర్ట ప్రభుత్వానికి పంపిస్తాం.. నిజాంను ఒకే సారి నేను గాడిద అని ఒక్కసారి అంటే దానిపై రాద్ధాంతం చేస్తున్నారు.. నిజాం చరిత్రలో దుర్మార్గమైన రాజు గానే మిగిలి పోతారు.. ఆయన పేరు చెబితే హిందువులకు గుర్తుకు వచ్చేది అయన చేసిన మారణకాండనే.. ముస్లింలకు అవాస్ యోజన కింద ఇల్లు, ఫ్రీ రేషన్, ఫ్రీ వాక్సినేషన్ మోడీ ఇస్తున్నారు.. ముస్లిం దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపించారు.. మీ పిల్లలకు విద్యా, వైద్యం ఇస్తుంది.. నిజాం అంత వెనుకోసుకొస్తున్నా.. రేవంత్ రెడ్డి ఏం చేశారని ఓట్లు వేస్తున్నారు.. ఇన్ని చేసినా మోడీకి ఎందుకు వేయడం లేదు.. ఇదేనా మీ ఇమాందారీ..” అని ఎంపీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!