-
AP High Court: వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా..
వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు. -
Gottipati Ravi Kumar: గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం? మంత్రి సంచలన ఆరోపణలు
గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. -
Venkatrami Reddy: గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1.34 వేల మంది సచివాలయాల్లో పని చేస్తున్నారన్నారు. ఏక పక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో సేవలు చెయ్యడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు. -
Minister Satya Prasad: భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి..
భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం ముఖ్యనేతలతో రెవెన్యూ.. ఎండోమెంట్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత ప్రభుత్వంలో భూములను కొట్టేశారా అనే ఆలోచనలు ఉండేవి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నాం. సింహాచలం భూములపై గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు. కానీ పూర్తి చేయలేకపోయారు.. ప్రస్తుతం పంచ గ్రామాల భూముల అంశంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. -
PMA Salam: పురుషులు-మహిళలు సమానం కాదు.. ముస్లిం లీగ్ నాయకుడి వివాదాస్పద ప్రకటన
కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు వివాదాస్పద ప్రకటన చేశారు. మహిళలు, పురుషులు సమానం కాదని ముస్లిం లీగ్ కేరళ విభాగం ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలాం అన్నారు. స్త్రీలను, పురుషులను సమానంగా పిలవడం వాస్తవికతకు వ్యతిరేకమన్నారు. అంటే ప్రస్తుత సమాజంలో ఆడ-మగ సమానత్వం లేదని ఆయన అభిప్రాయం. -
Supreme Court: ట్రిపుల్ తలక్కు వ్యతిరేకంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? రిపోర్టు ఇవ్వండి..
గత ఆరేళ్లలో ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దాఖలు చేసిన కేసుల వివరాలను సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019లో ఆమోదించిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించి, ట్రిపుల్ తలాక్ చెప్పి ఎంత మంది ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని కోరింది. -
Mustard Oil Benefits: ఆవ నూనె వంటలో వాడండి.. కీళ్ల నొప్పులు ఇట్టే మాయం?
ఆవాల నూనెలో బ్యూటీ నుంచి హెల్త్ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దానిని మీ దినచర్యలో భాగం చేసుకుంటే.. మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నూనెను వంటకు ఎంచుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. ఆవనూనెలో అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల వంటగదిలో ఇది చాలా అవసరం. అదనంగా ఇది తక్కువ సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. ఇది అతి ముఖ్యంగా కీళ్ల నొప్పులకు బాగా పనిచేస్తుంది. -
Health Tips: మూత్రంలో రక్తం పడితే.. క్యాన్సర్ వచ్చినట్టా?
క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవంగా చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడుతున్నారు. సమస్యేంటంటే ఈ వ్యాధి సోకిన చాలా మంది డాక్టర్లు చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు పట్టించుకోవడం లేదు. -
Tata Nexon CNG Dark Edition: టాటా కొత్త సీఎన్జీ కారు విడుదల.. రేటు, రేంజ్ ఎంతంటే?
టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్జీ (Nexon CNG) రెడ్ డార్క్ను విడుదల చేసింది. కంపెనీ ఎక్స్-షోరూమ్ ధరలను రూ.12.70 లక్షల నుంచి రూ.13.69 లక్షల వరకు ఉంచింది. ఫియర్లెస్ + PS, క్రియేటివ్ + PS, క్రియేటివ్ + S వంటి మూడు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టింది. రెడ్ డార్క్ ఎడిషన్ ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. రెడ్ కలర్ యాక్సెంట్లతో ఎక్స్టీరియర్లో కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్ను పొందుతుంది. -
Highest Mileage SUVs: “మైలేజీ కింగ్స్” అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్యూవీలు ఇవే..
భారతదేశంలోని మార్కెట్లో ఎస్యూవీల సెగ్మెంట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆకర్షణీయమైన లుక్, తక్కువ ధర కారణంగా భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తుంది. మీరు అద్భుతమైన మైలేజీతో కూడిన శక్తివంతమైన ఎస్యూవీలు కొనాలని చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్యూవీలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 1. గ్రాండ్ విటారా సీఎన్జీ- మైలేజీ కేజీకి 26.6 కి.మీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ మిడ్-సైజ్ ఎస్యూవీ గ్రాండ్ విటారా (Grand […]
తాజావార్తలు
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?