Mineral Water: నీరు మన జీవితానికి చాలా అవసరం. మంచి శుభ్రమైన తీరు తాగడం ముఖ్యం. ఎందుకంటే.. కలుషితమైన నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు ఉండవచ్చు. ఈ సూక్ష్మక్రిములు మురికి నీరు, పైపులైన్ లీకేజీ లేదా అపరిశుభ్రమైన నిల్వ కారణంగా వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కలలు కనడం ప్రతి మనిషిలోనూ సహజంగా వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను కలగజేసే కలలు వస్తే.. మరికొన్ని సార్లు ఆందోళనను కలగజేసే స్వప్నాలు వస్తుంటాయి. అందులోనూ పీడకలలు మనస్సులో ఉద్రిక్తతను పెంచుతాయి. స్థిరంగా మీకు పీడకలలు వస్తున్నాయంటే అంది అవాంఛనీయ సంఘటనలకు సంకేతంగా పరిగణించాలి.
మన శరీరంలో అత్యంత ప్రభావవంతమైన అవయవం మెదడు. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేదీ... నిర్ణయాలను చేసేది అదే. ఒక్కమాటలో చెప్పాలంటే మన శరీరంలో మెదడే హెడ్మాస్టర్. మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది. ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు, ఆలోచనలు, పని సంస్కృతి వంటివి కుదురుగా నిలవనీయడం లేదు. దీంతో మెదడుపై ఒత్తిడి పడుతోంది. కాలక్రమంలో మెదడు మొద్దుబారి పోతుంది. మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ చిట్కాలు పాటించండి..
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నారు. అవగాహన లోపం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు ముదిరిన దశలో నమోదవుతున్నాయి. అయితే పరిస్థితిని సకాలంలో గుర్తించడం, వైద్యుల సలహాతో, ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు.
ఎప్పుడో అప్పుడు కోపం రావటం సహజమే. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు సజావుగా లేకపోయినా.. మనస్పర్ధలు తలెత్తినా ఆగ్రహావేశాలకు లోనుకావటం, తిరిగి మామూలుగా అవటం పెద్ద విషయమేమీ కాదు. కానీ తరచూ ఆగ్రహానికి గురవుతున్నా, ఇది రోజువారీ వ్యవహారాలను దెబ్బతీస్తున్నా జాగ్రత్త పడాల్సిందే. ఇందుకు కొన్ని జబ్బులు కూడా కారణం కావొచ్చు. వీటి గురించి తెలుసుకొని ఉంటే ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవటానికి వీలుంటుంది. కోపం చాలా ప్రమాదకరం. కోపం వల్ల అనేక రకాల […]
Can You Eat Snake Eggs: వర్షాకాలం మొదలైందంటే చాలు సర్పాల బెడద ఎక్కువగా ఉంటుంది. పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. కానీ.. మీరు పాము గుడ్డును ఎప్పుడైనా చూశారా? దాన్ని తిన్నారా? దాన్ని ఆమ్లెట్ వేసుకుని తింటే ఏమౌతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సీబీఐలో సంచలన కేసులను విచారించడంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మంచి గుర్తింపు ఉంది. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. ఆయన తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. తాను జాబ్కు రాజీనామా చేయడానికి గల కారణాన్ని ఓపెన్గా చెప్పారు. తాను రూరల్ డెవలెప్ మెంట్కు వెళ్లాలనుకున్నానని తెలిపారు. హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఓ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఆ ఇంటర్య్వూకి వెళితే…
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన రాజకీయ ఎంట్రీకి ఎక్కడ బీజం పడిందో చెప్పారు. ఆయన తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. పాఠశాల నాటి పరిస్థితులు, రాజకీయంపై ఆసక్తి పెరగడానికి గల కారణాలు వివరించారు. తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని.. అక్కడి నుంచే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లమని తెలిపారు.
Hydrogen-Powered Train: భారత్ విద్యుత్, డీజిల్తో నడిచే సాంప్రదాయ రైళ్లను వదిలివేసి.. హైటెక్, సూపర్ఫాస్ట్ రైళ్ల నెట్వర్క్ను సృష్టించడంలో బిజీగా ఉంది. బుల్లెట్ రైలు, హైపర్లూప్, మోనో రైలుతో పాటు, హైడ్రోజన్ రైలు తయారీలో వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, చైనా దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి.