Hydrogen-Powered Train: హైడ్రోజన్ రైలు తయారీలో కీలక పురోగతి.. గంటకు 40వేల లీటర్ల నీరు చాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydrogen-Powered Train: భారత్ విద్యుత్, డీజిల్తో నడిచే సాంప్రదాయ రైళ్లను వదిలివేసి.. హైటెక్, సూపర్ఫాస్ట్ రైళ్ల నెట్వర్క్ను సృష్టించడంలో బిజీగా ఉంది. బుల్లెట్ రైలు, హైపర్లూప్, మోనో రైలుతో పాటు, హైడ్రోజన్ రైలు తయారీలో వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, చైనా దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. ఈ కాలుష్య రహిత రైళ్లు కలిగిన ఐదవ దేశంగా భారత్ అవతరించనుంది. ఇందులో భాగంగా.. మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే కోచ్ (భారతదేశంలో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్) శుక్రవారం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో విజయవంతంగా పరీక్షించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా సమాచారం అందించారు. భారతదేశం 1200 హార్స్పవర్ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. అసలు ఏంటి ఈ హైడ్రోజన్ రైలు, ఇది ఎలా నడుస్తుంది? అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం…
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
కాగా.. మొదటి రైలు హర్యానాలోని జింద్, సోనిపేట మధ్య 89 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఈ రైలుకు 1,200 హెచ్పీ (హార్స్ పవర్) ఇంజిను అమర్చనున్నారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా డిజైన్ చేశారు. గత ఏడాది కేంద్ర బడ్జెట్లో హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.2,300 కోట్లతో 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఒక కోచ్ నిర్మాణం పూర్తయింది. తాజాగా విజయవంతంగా పరీక్షించారు. ఈ రైళ్ల వల్ల కర్బన ఉద్గారాలు, శబ్దం బాగా తగ్గుతాయి. రాబోయే హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అనేక ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత అధునాతన రైళ్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ రైలు నడవడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ వినియోగిస్తారు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడుతుంది. ఈ రైలు నడిచేందుకు గంటకు 40వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్లు వెళ్లగలదు.
READ MORE: Cobra snake: విచిత్రం.. నాగుపామునే కరిచి చంపిన ఏడాది బాలుడు..
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!