-
Rangareddy: “ఏకరాల కొద్ది భూమి.. భారీగా బంగారం”.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్ రికార్డు ఏడీ అరెస్ట్
Rangareddy Land Records AD Srinivas Arrested by ACB: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టుగా వచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు గురువారం తెల్లవారుజామున ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. -
Rajanna Sircilla: విషాదం.. గుండెపోటుతో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మృతి..
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ఠానా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రజా సేవ చేయాలనే తపనతో ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి.. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. వేములవాడ అర్బన్ మండలం, చింతల్ఠానా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి నిన్న అకస్మాత్తుగా కుప్పచూలాడు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంతో ఉత్సాహంగా నిన్నటి వరకు ప్రచారం… -
Modi – Putin: ఒకే ఫ్రేమ్లో వరల్డ్ డైనమిక్ లీడర్స్(ఫొటోలు)
Modi Putin One Frame Images: రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానాశ్రయంలో పుతిన్కు ఘన స్వాగతం పలికారు. నాలుగు సంవత్సరాల తర్వాత పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. -
New toll system: గుడ్న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి.. టోల్గేట్ల వద్ద క్షణం కూడా ఆగాల్సిన పనిలేదు..!
New toll system India 2025: ప్రయాణికులకు కేంద్ర మంత్రి గుడ్న్యూస్ చెప్పారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు ముగుస్తుందని, దాని స్థానంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ వస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ వసూలుతో హైవే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోల్ వసూలు చేసి మంచి అనుభవాన్ని కల్పిస్తుందని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థను 10 చోట్ల అమలులోకి తెచ్చామని, ఏడాదిలోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. -
Konda Vishweshwar Reddy: లోక్సభలో కోతుల సమస్యలను ప్రస్తావించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి..
BJP MP Konda Vishweshwar Reddy: లోక్సభ జీరో హవర్లో బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కోతుల సమస్యలను లేవనెత్తారు. కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని తెలిపారు.. కోతుల సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని కోరారు. కోతుల సమస్య తమ శాఖ కిందికి రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని.. కోతుల సమస్య ఏ శాఖ కిందికి వస్తుందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర నుంచి సమాధానం రావాల్సి ఉంది.. -
Maoist Party: బీజాపూర్ ఎన్కౌంటర్లో పెరిగిన మృతుల సంఖ్య.. హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ లేఖ..
Maoist Party: బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. భద్రతా దళాలు ఇప్పటివరకు 16 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది నక్సలైట్లు చనిపోయినట్లుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ముగ్గురు జవాన్లు మృతి చెందారు.. నిన్న 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. READ MORE: YS Jagan: పండుగలా ఉండాల్సిన వ్యవసాయం.. […] -
The Dark Side of Electric Vehicles: “నమ్మశక్యం కాని నిజం”.. ఎలక్ట్రిక్ కార్ల వల్లే అధిక కాలుష్యం..
Electric Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన శ్రేణిలో వీటి వృద్ధి అధికంగా ఉంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో 2030 నాటికి మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం ఈవీలు ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. దీని ద్వారా వాయు కాలుష్యం, ఇంధన దిగుమతుల తగ్గింపు సాధించవచ్చని కేంద్రం భావిస్తోంది. కానీ.. దీని వెనుక "నమ్మశక్యం కాని నిజం"కాని మరో నిజం ఉంది.. నిజానికి పెట్రోల్-డీజిల్ కార్ల కంటే ఈ వాహనాల వల్ల… -
Pamela Satpathy: “మీరు సూపర్ మేడం”.. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంచే పాట పాడిన కలెక్టర్..
Pamela Satpathy: కరీంనగర్లో దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం నింపేందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఒక చిన్నపాటి నిర్ణయం.. అనూహ్యంగా పెద్ద స్ఫూర్తిగా మారింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి ఆమె పాడిన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హృదయాలను హత్తుకుంటోంది. ఇది కేవలం ఒక కలెక్టర్–విద్యార్థిని కలయిక కాదు.. ప్రతిభకు కాస్త అండగా నిలిస్తే ఎంతటి మంచి ఫలితం వస్తుందో చూయిస్తోంది. -
KTR: మేం అధికారంలోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటాం.. పారిశ్రామిక వేత్తలకు కేటీఆర్ హెచ్చరిక..!
KTR: నాడు పరిశ్రమలకు రాయతీపై విలువైన భూములు కేటాయించారు.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఇపుడు భారీగా పెరిగాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా కుత్బుల్లాపూర్లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జీడిమెట్ల ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో 75 వేల కోట్ల వరకు విలువ చేసే భూములు ఉన్నాయి.. రెండేళ్లలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ఇండ్లు కట్టవచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టవచ్చు... కానీ, ఇవేవీ చేయరట.. శ్మశాన వాటికలకు కూడా స్థలం లేదు.. కాలుష్యాన్ని… -
Aurus Senat: ఇదో “రక్షణ కవచం”.. బాంబులు సైతం ఏం చేయలేవు.. పుతిన్ కారు గురించి తెలుసా..?
Aurus Senat: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతి విదేశీ పర్యటనలో చర్చకు వచ్చేది ఆయన భద్రత. ముఖ్యంగా ఆయన ప్రయాణించే "ఆరస్ సెనేట్ లిమోసిన్" కారు ప్రతి సారి వార్తల్లో నిలుస్తోంది. పుతిన్ భారత్ పర్యటనకు రానున్న వేళ, ఈ ప్రత్యేక వాహనాన్ని రష్యా నుంచి నేరుగా ప్రత్యేక కార్గో విమానంలో ఢిల్లీకి చేరవేయాలని నిర్ణయించారు. దీంతో ఈ కారు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపై అనేక శక్తివంతమైన దేశాధినేతలు విలాసవంతమైన వాహనాలు ఉపయోగించినా, సెనేట్కు ఉన్న ప్రత్యేక…
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!