Jhansi honor killing: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఒక ప్రేమికుల హత్య కేసు సంచలనంగా మారింది. మూడు రోజుల్లోనే రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఆ ప్రేమికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Eluru Police: వివిధ అవసరాలతో ఇబ్బంది పడే పేద ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏలూరు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇళ్లలో వాడకుండా ఉండే పాత బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలను ఇతరులు ఉపయోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు.. కైండ్ నెస్ వాల్ పేరుతో ఏర్పాటు చేసిన వినూత్న ప్రయోగానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఏలూరు జిల్లా పోలీసులు ఆశిస్తున్నారు..
Pulivendula-Byelection: మరి కాసేపట్లో ఉప ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం కాకరేపింది. గత వారం రోజులుగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. దాడులతో పులివెందుల దద్దరిల్లిపోయింది. అయినా వైసీపీ వెనకడుగు వేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు మారు మోగాయి.
Trump India Tariffs: భారతదేశంపై అమెరికా 50 % అదనపు సుంకం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్ఎస్ఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికన్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం కింద, దేశవ్యాప్తంగా విదేశీ కంపెనీలను, వాటి ఉత్పత్తులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Dark Clouds Cover Hyderabad: ఇది మధ్యాహ్నమేనా? అనే విధంగా హైదరాబాద్ను మబ్బుల చీకట్లు కమ్ముతున్నాయి. నగర వాతావరణం.. మిట్ట మధ్యాహ్నం సాయంత్రాన్ని తలపిస్తోంది. ఆకాశమంతా మబ్బులతో కమ్మేయడంతో హైదరాబాద్ మసక బారింది. మరోసారి భారీ వర్షం తప్పదని కారు మబ్బులు సూచిస్తున్నాయి. కాగా.. సెలవు దినమవ్వడంతో ఇళ్లకే పరిమితమవ్వాలని బల్దియా అధికారులు సూచిస్తున్నారు.
Pawan Kalyan: గిరిజన ప్రాంతాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పంచాయతీరాజ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు. అడవితల్లి బాట పనులను వేగవంతం చేయాలన్నారు. సవాళ్ళు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలి.. డోలీరహిత గిరిజన నివాసాలు ఉండాలన్నాదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు.
PMBJP Warehouse Inaugurated in Uppal: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జన ఔషధీ పరియోజన ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి భారతీయ జనసౌది పరియోజన (PMBJP) తెలంగాణ మార్కెటింగ్ కం డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్ వారి సహకారంతో ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేశారు.. ఈ వేర్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, […]
Sangareddy: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగిసింది. అయినా కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం మన నాయకులు చెత్త పాలనకు అద్దంపడుతోంది. గిరిజన గ్రామాల్లో సైతం రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది.
పార్టీలోకి రాకముందు తనకు అనుమానాలు రేకెత్తించారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తాజాగా బీజేపీలో చేరిన ఆయన ఆ సమావేశంలో మాట్లాడారు. దేశ రక్షణ కోసం ఆర్కిటెక్ట్ గా పనిచేస్తానన్నారు. ఒక దళిత అంశం మీద మాట్లాడడానికి మాత్రమే బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందన్నారు. పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అని పారిశ్రామిక వేత్త నుంచి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అన్ని పార్టీలను స్టడీ చేసిన తర్వాత బీజేపీలో చేరానన్నారు. కార్యకర్తలకు చెప్పకుండా బీఆర్ఎస్కు రాజీనామా చేసినందుకు క్షమించాలన్నారు. […]
కేటీఆర్తో గ్యాప్పై మాట్లాడటానికి కవిత ఇష్టపడలేదు. కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పైనే ఫోకస్ ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతారన్నారు. బండి సంజయ్ కు ఈటల వార్నింగ్ ఇచ్చినా.. చర్చ లేదన్నారు. బీఆర్ఎస్ గురించే ఎందుకు చర్చ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అనంతరం సింగరేణిపై మాట్లాడుతూ.. ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం సింగరేణి.. సింగరేణిని తెలంగాణ […]