Saba Karim: నేడు టీమిండియా సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో ఆదివారం అహ్మదాబాద్లో జరగనున్న తొలి మ్యాచ్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. టోర్నీలో ఇప్పటివరకు తన ఆటతీరుపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ మంత్రం అభిషేక్ను వెనకేసుకు రావడం విశేషం. అయితే.. తాజాగా అభిషేక్ ఫామ్పై భారత మాజీ క్రికెటర్, మాజీ సెలెక్టర్ సయ్యద్ సబా కరీం (Saba Karim) స్పందించారు. అభిషేక్ తిరిగి పుంజుకునే సామర్థ్యం ఉందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
READ MORE: T20 World Cup 2026: సూపర్ 8 ఆడకుండానే సెమీస్లోకి భారత్.. ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు!
తాజాగా ESPNcricinfoతో మాట్లాడిన సబా కరీం, అభిషేక్ కొంచెం ఓపికగా ఆడితే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యర్థి బౌలర్లు అతని దూకుడు ఆటతీరుకు ముందుగానే సిద్ధంగా ఉంటారని, అందుకే తన ఆటలో చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొదటి బంతి నుంచే భారీ స్ట్రైక్రేట్తో పరుగులు చేయాలనే ఒత్తిడిని వదిలి, సూటిగా బ్యాట్ ఆడుతూ కాస్త సమయం తీసుకుంటే మళ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడని సూచించారు. “ఇది చాలా మంది ఆటగాళ్లు ఎదుర్కొనే దశ. అభిషేక్కు ఇది పెద్ద పరీక్ష. ఒకటి లేదా రెండు ఓవర్లు సెట్ అయితే తర్వాత తన సహజమైన దూకుడు ఆటతో పరిస్థితిని సులభంగా మార్చగలడు. ఆటతీరు పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు కానీ బౌలింగ్కు అనుగుణంగా కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలి” అని కరీం తెలిపారు. ఇక అభిమానులు మాత్రం అభిషేక్ బ్యాటింగ్ మారాలని కోరుకుంటున్నారు. తిరిగి ఫామ్లోకి రావాలని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Gautam Gambhir: “అరే యార్.. మీరు ఎలా మేనేజ్ చేస్తారు?”.. అభిమానులతో గంభీర్ ఫన్నీ చిట్చాట్ వైరల్