Digital Arrest Scam: సైబర్ క్రిమినల్స్ వలలో పడితే అంతే. మాటలతోనే భయపెడతారు. పోలీసులమని లేదా ఇన్వెస్టిగేషన్ అధికారులమని చెప్పి.. అందినకాడికి దోచేస్తారు. ముఖ్యంగా ఈ మధ్య వృద్ధులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అలా సైబర్ ముఠాకు చిక్కిన ఓ వృద్ధుడు ఏకంగా 23 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడు. అంతేకాదు వృద్ధున్ని నెల రోజులు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రిమినల్స్ బెదిరించారు. అంతా అయిపోయాక మోసపోయానని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు వృద్ధుడు. డిజిటల్ అరెస్ట్.. ఈ పేరుతో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఇలాగే…
Nara Lokesh: ‘ఓజీ’ సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఏపీ జీవోలో మార్పు చోటుచేసుకుంది. ప్రీమియర్ షో సమయాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో.. ఈ నెల 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శనకు అవకాశం కల్పించింది.
Mirzapur Folk Singer Saroj Sargam Arrested: హిందూ దేవీ, దేవతలను కించపరుస్తూ మాట్లాడటం, పాటులు పాడటం సర్వసాధారణంగా మారుతోంది. తాజాగా దేశం మొత్తం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటోంది. దుర్గాదేవిని జగన్మాతగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కానీ.. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్కి చెందిన సరోజ్ సర్గం అనే ఫోక్ సింగర్ మాత్రం దుర్గామాతను కించపరుస్తూ పాట పాడింది. తన పాటలో విష్ణుమూర్తిని హంతకుడిగా, దుర్గమ్మను వేశ్యగా.. ప్రహ్లాదుడిని తాగుబోతుగా ఆమె అభివర్ణించింది. ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ రాయ్ ఫిర్యాదు ఆధారంగా మదిహాన్…
Vijayawada rape case: విజయవాడ కొత్తపేట పోలీసుల నిర్లక్ష్యం బట్టబయలైంది. విజయవాడ పంజా సెంటర్ దగ్గర మతిస్థిమితం లేని అమ్మాయిని అర్ధరాత్రి యువకుడు రేప్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకులు రేప్ చేసిన మతిస్థిమితం లేని అమ్మాయిని విజయవాడ స్వరంగం దగ్గర పడేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఈ అంశం బయటకు రాకుండా టూ టౌన్ సీఐ కొండలరావు గోప్యంగా ఉంచుతున్నారు. కనీసం…
మహాభారత పంచమవేదంగా కీర్తి గాంచింది. వ్యాస మహర్షి.. గురువు స్థానంలో.. ఉంది మహాభారతం చెబుతుంటే.. సాక్షాత్తు ఆది పూజ్యుడు గణపతి శిష్యుడు గా మారి మనవాళికి అందించిన అమృత భాండం మహాభారతం.. ఈ మహాత్తర ఘట్టంలో ధృతరాష్ట్ర, గాంధారిల సంతానం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ దంపతులకు వంద మంది కుమారులు ఉన్నారని మనం చిన్నప్పుడే చదివాం. తాజాగా ఓ వ్యక్తి తనకు కూడా వంద మంది పిల్లలు ఉన్నారని చెబుతున్నాడు. ఇది విన్న జనం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఎవరా…
Director Sukumar: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ సినిమా దర్శకులు సుకుమార్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప- 3 సినిమా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. తన సినిమాలు అన్ని గోదావరి జిల్లాలోనే ఎక్కువగా తీస్తున్నామని చెప్పారు.. గోదావరి జిల్లాల వాడిని కావడం తన అదృష్టమన్నారు. రాజమండ్రి అంటే తనకెంతో ఇష్టమని.. సింధూరం, రంగస్థలం, పుష్ప వంటి సూపర్ హిట్ చిత్రాలు ఇక్కడే తీసినట్లు వెల్లడించారు.
C.P. Radhakrishnan: విజయవాడ పున్నమి ఘాట్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ – 2025లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. నగర ప్రజల మనసు హత్తుకునేలా ప్రసంగించారు. ప్రారంభంలో అందరికీ “తెలుగు భాషలో నమస్కారం” చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉపరాష్ట్రపతి, తెలుగు భాష అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ, “అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయి. సాహిత్యభరితంగా, సంగీతభరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తోంది” అని అన్నారు.
Pawan Kalyan: కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన విరమించారు. వచ్చే నెల10వ తేదీన పవన్ కల్యాణ్ వస్తారని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఆ సమావేశంలోపు పరిష్కార మార్గాలుపై అధికారులతో చర్చించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారన్నారు. పవన్ వచ్చేంత వరకు ఈ 16 రోజులు తాము వేటకు వెళ్ళమని మత్స్యకారులు తేల్చిచెప్పారు. అప్పటికి డిప్యూటీ సీఎం రాకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
Karnataka High Court Rejects X (Twitter) Petition: కర్ణాటక హైకోర్టులో ఎక్స్ (గతంలో ట్విట్టర్)కు ఎదురుదెబ్బ తగిలింది. ప్లాట్ఫారమ్లోని కొన్ని ఖాతాలు, పోస్ట్లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ ఎక్స్(గతంలో ట్వీటర్) దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. భారతదేశంలో పనిచేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు దేశ చట్టాలను పాటించాలని జస్టిస్ ఎం. నాగప్రసన్న స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాను నియంత్రించడం అవసరమని, కంపెనీలు నియంత్రణ లేకుండా పనిచేయడానికి అనుమతించలేమని కోర్టు పేర్కొంది. భారత…
Botsa Satyanarayana: ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతిలో ఉంటేనే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.. తాజాగా మండలిలో విపక్షనేత మాట్లాడారు. పీపీపీ మోడ్ లో పెట్టిన కళాశాలలు ఫెయిల్ అయ్యాయని.. ప్రభుత్వం ఆధ్వర్యంలో కళాశాలలకు ఉండే బాధ్యత ప్రైవేటీకరణ జరిగితే ఉండవన్నారు. కరోనా లాంటి విపత్తులు సంభవిస్తే స్పెషాలిటీ ఆస్పత్రుల అవసరం ఉంటుందని.. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.. వైద్యాన్ని, చదువును డబ్బులతో సభ్యులు కొలవటం సరికాదన్నారు.. ఏ ప్రైవేట్ సంస్థ […]