Deputy CM Pawan Kalyan Congratulates Mega DSC 2025 Teachers: మెగా డీఎస్సీ – 2025 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీరంతా ఎన్నో ఏళ్ళు డీఎస్సీ కోసం నిరీక్షించారన్నారు. ఏక కాలంలో 15,941 మంది ఉపాధ్యాయులను నియమించిన ఈ శుభ సమయం రాష్ట్ర విద్యారంగంలో చిరస్థాయిగా మిగిలిపోతుందని తెలిపారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డీఎస్సీ ద్వారా వారికి దారి చూపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు.…
CM Chandrababu: రాజకీయాల్లోకి రావడానికి ఎకనామిక్స్ ప్రొఫెసర్ డీఎల్ నారాయణ తనను ప్రోత్సహించారు. యూనివర్శిటీ క్యాంపస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్లకే మంత్రి అయ్యానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మెగా డీఎస్సీ విజేతల సభలో సీఎం ప్రసంగించారు. మనల్ని ప్రోత్సహించే వారుంటే ఆకాశమ హద్దుగా ఉంటుందన్నారు. పిల్లల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులే గుర్తించాలని.. ప్రపంచ మార్పుల మేరకు ఏపీ యువత విద్య అభ్యసించాలని సూచించారు. పిల్లల మనోభావాల మేరకు చెబితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం.. డీఎస్సీ ద్వారా కొత్తగా…
Stock Markets: స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 555.95 పాయింట్లు తగ్గి 81,159.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 166 పాయింట్లు తగ్గి 24,890.85 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 145 పాయింట్లు పడిపోయింది. బీఎస్ఇ స్మాల్క్యాప్ ఇండెక్స్ 400 పాయింట్లు, బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 330 పాయింట్లు పడిపోయాయి.
Supreme Court: చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడి, తమ ఉజ్వల భవితకు బాటలు వేసిన తల్లిదండ్రుల విషయంలో కొందరు పిల్లలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జీవితంలో ఎదిగేందుకు అడుగడుగునా అండగా ఉన్న పోషకులను, తాము పోషించలేం అంటూ అనాథలుగా వదిలేస్తున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఆపద వేళ బాధ్యతగా చూసుకోవాల్సిన కుమారులు, తమకు సంబంధం లేదంటూ వారిని పరాయి మనుషులుగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల వద్దు కానీ.. వాళ్లు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలని పట్టుబడుతున్నారు. అలాంటి వాళ్లను తాజాగా సుప్రీంకోర్టు […]
మెగా డీఎస్సీ విజేతల సభ ప్రారంభమైంది. డీఎస్సీలో 15,941 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారు. సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెగా డీఎస్సీ విజేతల సభకు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలను నిర్వహించారు. 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనతను దక్కించుకుంది కూటమి పార్టీ. 2025 ఏడాదిలో మెగా డీఎస్సీ ప్రక్రియను…
AP Assembly: గత ప్రభుత్వ హయాంలో జగన్ను సినీ ప్రముఖులు కలిసిన అంశంపై ఏపీ అంసెబ్లీలో మాటల యుద్ధం జరిగింది. కామినేని శ్రీనివాస్ vs మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. లా అండ్ ఆర్డర్పై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. అపట్లో జగన్ ఇంటికి కొంత మంది సినీ ప్రముఖులు వచ్చారు. అప్పుడు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా..
Balakrishna Fires in AP Assembly: ఏపీ అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్పై చర్చ జరిగింది. ఈ చర్చ మధ్యలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ప్రముఖులకు జగన్ అపోయింట్మెంట్ ఇవ్వలేదని.. చిరంజీవి గట్టిగా అడిగితే ఇచ్చారని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యపై బాలకృష్ణ స్పందించారు.. చిరంజీవి గట్టిగా ఆడిగితే జగన్ అపోయింట్మెంట్ ఇచ్చారనడం అబద్ధం అన్నారు..
CM Chandrababu: మాజీ మంత్రి వివేకా హత్యకేసు మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులివ్వడం పోలీసుశాఖలో కలకలం రేపింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామం ఎన్నడూ జరగలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు.
CM Chandrababu: జగన్ ప్రభుత్వంలో మొదటి బాధితుడు తానే అని సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. పవన్ కల్యాణ్ ను కూడా హైదరాబాద్ నుంచి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు అనేకం ఉన్నాయన్నారు. తనది కక్ష రాజకీయాలు కాదని.. బాధ్యత కలిగిన నాయకుణ్ణి కాబట్టే ప్రజలు నాలుగో సారి నన్ను సీఎం గా ఎన్నుకున్నారన్నారు. 2003 లో అలిపిరిలో యాక్సిడెంట్ అయింది.. నేను మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం..
CM Chandrababu: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2 వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరుఫున సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఎవరికి దక్కని భాగ్యాన్ని తనకు కల్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. 14 సార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం కల్పించారని తెలిపారు. 22 సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి ప్రాణబిక్ష పెట్టారని.. వేంకటేశ్వర స్వామి వారి ప్రాభల్యాని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లారన్నారు.