GST Impact in AP: జీఎస్టీ ప్రభావంతో ఏపీలో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. కొత్త పన్ను విధానంతో ప్రజలకు ఊరట లభించింది. రోజుకి 4 వేల రిజిస్ట్రేషన్ల దిశగా రాష్ట్రం ముందడుగేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి స్పందించారు. రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని, పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారన్నారు రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు…
Nimmala Ramanaidu: సందర్భం ఏదైనా తెలుగు దేశం పార్టీపై .. పసుపు రంగుపై ఆయనకి ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతని వదిలిపెట్టని నాయకుడిగా మారిపోయారు మంత్రి నిమ్మల రామానాయుడు. పార్టీ కార్యక్రమమైన, అసెంబ్లీ సమావేశాలైన నిత్యం పసుపు చొక్కాతో కనిపించే మంత్రి నిమ్మల రామానాయుడు తన కూతురి వివాహ వేడుకలోనూ పసుపు చొక్కాని వదిలిపెట్టలేదు. పాలకొల్లులో ఈరోజు జరిగిన నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకులు హాజరయ్యారు. ఆ సమయంలోనూ మంత్రి…
Dussehra Lucky Draw: దసరాకు పలు కంపెనీలు తమ ఉత్పత్తులకు గిరాకీ పెంచుకునేందుకు పలు ఆఫర్స్ ప్రకటిస్తాయి. ఇంకా కొన్ని కంపెనీలు లక్కీ డ్రా నిర్వహిస్తూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటిస్తాయి. అయితే ఓ గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించారు. రూ.150 కూపన్ తీసుకుంటే పండుగకు ముందు లక్కీ డ్రా తీసి అందులో విజేతలకు ప్రకటించిన బహుమతులను అందజేయాలని నిర్ణయించారు. ఇంతకీ అదిరిపోయే బహుమతులు ఏమిటి..? ఈ లక్కీ డ్రా ఎక్కడ నిర్వహిస్తున్నారు తెలియాలంటే ఇది చూడండి..
MLC Kumbha Ravibabu: దేశ చరిత్రలో ఆరోగ్య శ్రీ ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అన్నారు.. తాజాగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.. ప్రతి పార్లమెంట్లో మల్టీ హాస్పిటల్స్ పెట్టాలని, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు పెంచడం కోసం ప్రతి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్లు మొదలు పెట్టారన్నారు.. రాష్ట్రంలో అరకొర సీట్లు సరిపోక ఇతర దేశాలకు విద్యార్థులు పోతున్నారని తెలిపారు.. చంద్రబాబు 4సార్లు…
RK Roja: పవన్ కల్యాణ్కి రైతు సమస్యలు మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టవని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.. హరిహర వీరమల్లు, OG సినిమా షూటింగ్ ల కోసం, బెనిఫిట్ షోలు రేట్లు ఎంత పెంచుకుందామని ఆలోచన తప్ప... ప్రజా సమస్యల పట్టవని విమర్శించారు.. ఆయన నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించరన్నారు... పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లు చేసుకుంటే... రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు? అని ప్రశ్నించారు. ఈసారి పవన్ కల్యాణ్ కి డిపాజిట్లు కూడా రావంటూ సంచలన…
Pakistan: పాకిస్థాన్ భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా.. దష్ట్ ప్రాంతంలోని జాఫర్ ఎక్స్ప్రెస్లో సోమవారం పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు కారణంగా రైలులోని బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదం భయాందోళనలు సృష్టించింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. రైలు ఆ దష్ట్ ప్రాంతానికి చేరుకోగానే పేలుడు సంభవించింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఒక కోచ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. బోగీలు పట్టాలు తప్పినట్లు ప్రమాదానికి […]
Chhindwara Navratri: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తున్నారు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఊరూరా ఏర్పాటుచేసిన మండపాల్లో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి వేడుకలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. కాగా.. నవరాత్రుల పవిత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లా జమునియా గ్రామంలో భక్తులు ఒకవైపు దుర్గామాత పూజల్లో మునిగితేలుతుండగా మరోవైపు గిరిజనులు రావణుడిని ఆరాధిస్తున్నారు. జమునియా గ్రామం నగరానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకి మొహల్లాలో ఈ అపూర్వ దృశ్యం…
MP: మధ్యప్రదేశ్లోని సాగర్లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి, మధ్యప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేస్తున్న తన భార్యపై ఫిర్యాదు చేశాడు. వేధింపులు, వివాహేతర బంధంపై కంప్లైంట్ ఇచ్చాడు. ఆ భర్త తన భార్యకు మంచి చదువును అందించి ఆమె కలలను నెరవేర్చాడు. కానీ ఆ మహాతల్లి నిర్వకం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.
Pakistan vs Sri Lanka: 2025 ఆసియా కప్లో పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడుతుంది. ఇది పాకిస్థాన్కు డూ-ఆర్-డై మ్యాచ్. ఈరోజు పాకిస్థాన్ ఓడిపోతే, ఫైనల్కు చేరుకోవాలనే ఆశలు అడియాశలుగా మారిపోతాయి. శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు జట్లు తమ తొలి సూపర్ ఫోర్ మ్యాచ్లో పరాజయాలను చవిచూశాయి. శ్రీలంక తన తొలి సూపర్ ఫోర్ మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, పాకిస్థాన్ తన సూపర్ ఫోర్ ఓపెనర్లో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.…
Bangalore Marriage Dispute: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక వింతైన వైవాహిక వివాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో కొత్తగా పెళ్లైన జంటకు సంబంధించినది. ఫస్ట్ నైట్ రోజు తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదని భార్య భర్త నుంచి 2 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేసింది. వివాహం జరిగి కొన్ని వారాలు గడిచినా.. తన భర్త తనతో లైంగిక సంబంధం పెట్టుకోలేదని భార్య ఆరోపించింది.