Legendary Cricket Umpire Dickie Bird Passes Away: క్రికెట్ ప్రపంచం నుంచి ఓ దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది. అద్భుతమైన నిర్ణయాలు, నిష్పాక్షిక అంపైరింగ్కు పేరుగాంచిన లెజెండరీ అంపైర్ డిక్కీ బర్డ్ 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన క్రికెట్ చరిత్రకు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించారు.
Mumbai PSI Durga Kharde's assault video: సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలోని ఒక మహిళా పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ (PSI), ఫిర్యాదుదారులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వాదన సమయంలో సబ్-ఇన్స్పెక్టర్ దుర్గా ఖర్డే తన నేమ్ప్లేట్ బ్యాడ్జ్ను తీసివేసి ఫిర్యాదుదారుపై విసిరేస్తోంది. ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో అనే రీతిలో దౌర్జన్యం చేస్తోంది. బూతులు తిడుతూ.. కొట్టడానికి మీదికి వస్తోంది. ఈ సంఘటన ముంబైలోని వీపీ రోడ్ పోలీస్ స్టేషన్లో…
Vande Bharat Sleeper Trains: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ లభించడంతో.. వందే భారత్ స్లీపర్స్ను తెచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది.
Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మైలురాయిని ఎట్టకేలకు సాధించారు. తన "జవాన్" చిత్రానికిగాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇది షారుఖ్ ఖాన్ తన 33 ఏళ్ల కెరీర్లో పొందిన మొదటి జాతీయ అవార్డు. ఇది అతడి సినీ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్…
Mahindra Scorpio Classic: మహీంద్రా స్కార్పియో భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా స్కార్పియో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్గా మారుతోంది. మీరు కూడా ఈ నంబర్ -1 ఎస్యూవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం! నిజానికి.. జీఎస్టీ సంస్కరణలు 2.0 తర్వాత.. కంపెనీ మహీంద్రా స్కార్పియో ధరలను రూ. ₹1.01 లక్షలకు తగ్గించింది. దీనితో పాటు.. ఈ ఎస్యూవీపై వేలది రూపాయల విలువైన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే […]
Maruti Suzuki sales: మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు సోమవారం నవరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నాయి. కొత్త జీఎస్టీ సంస్కరణ అమల్లోకి రావడంతో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సోమవారం 25,000 యూనిట్లకు పైగా రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. త్వరలో 30,000 యూనిట్లను దాటే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. సోమవారం దాదాపు 80,000 కస్టమర్ తమ కార్లను పరిశీలించేందుకు వచ్చారని కంపెనీ తెలిపింది.
India's Biggest Digital Arrest Scam: గత కొన్ని ఏళ్లుగా దేశవ్యాప్తంగా అనేక డిజిటల్ అరెస్టు కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ కేసు ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ కేసు పోలీసులను, దర్యాప్తు సంస్థలను కూడా ఆశ్చర్యపరిచింది. దక్షిణ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా దీనికి బలయ్యాడు. ఈ వృద్ధుడిని ఏకంగా నెలకు పైగా అరెస్టు చేశారు. అతడు జీవితాంతం పొదుపు చేసిన 23 కోట్ల రూపాయలు దోచుకున్నారు.
Shocking Incident in Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని ముస్లిం సమాజానికి చెందిన స్మశానవాటికలో సమాధులను తారుమారు చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం, నగరంలోని బడా అవార్లోని పెద్ద స్మశానవాటికలో రెండు సమాధులు తవ్వినట్లు గుర్తించారు.
Alcohol and Weight Gain: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సీసాపై హెచ్చరిక రాసి ఉంటుంది. ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. మద్యపానం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Heart Attack: ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్ఫుడ్ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా మారు తున్నాయి.