ICC Fines SuryaKumar Yadav: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ ప్రకటన రాజకీయ ప్రేరేపితమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
Farmer Suicide: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్షి తాలూకాలోని దహితానే (వైరాగ్) గ్రామంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అధిక వర్షపాతం, పెరుగుతున్న విద్యా ఖర్చులతో బాధపడుతూ ఒక రైతు మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 40 ఏళ్ల లక్ష్మణ్ కాశీనాథ్ గవాసానేగా గుర్తించారు.
Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్లో జరిగిన "ఐ లవ్ మొహమ్మద్" కార్యక్రమంలో ఒక మతాధికారి చేసిన ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. బహిరంగ వేదిక నుంచి మతాధికారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బహిరంగంగా సవాలు చేశారు. మజల్గావ్కు వస్తే.. సీఎం యోగిని అక్కడే ఖననం చేస్తానని హెచ్చరించాడు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
US Pakistan Relations: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్లను వైట్ హౌస్లో కలిశారు. ఓవల్ కార్యాలయంలో షాబాజ్, మునీర్లను కలవడానికి ముందు.. ట్రంప్ వారిద్దరినీ ప్రశంసించారు. మునీర్ను కొంచెం ఎక్కువగానే మెచ్చుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ సమావేశం కావడం ఇది రెండవ సారి. ట్రంప్ గతంలో జూన్ 18, 2025న మునీర్ను కలిశారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కాగా.. పాకిస్థాన్పై ట్రంప్ యు-టర్న్ తీసుకోవడంపై…
WHO: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఓ ప్రకటన వివాదానికి దారితీసింది. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో టైలెనాల్ (పారాసెటమాల్) తీసుకోకూడదని ఆయన అన్నారు. ఈ ఔషధం పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ఆటిజం కేసులకు ఈ ఔషధం కారణమని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా గందరగోళలం నెలకొంది. వైద్యులు పారాసెటమాల్ సురక్షితమైందని.. ఆటిజంతో దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది.
Maruti Suzuki Sales: ప్రస్తుతం పండుగల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే మార్కెట్ సందడిగా ఉంది. సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ మరింత ఉత్సాహాన్ని జోడించింది. వాహనాల ధరలు గణనీయంగా తగ్గాయి. దీని ప్రత్యక్ష ప్రభావం కార్ల కొనుగోళ్లపై కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మారుతి సుజుకి కార్ల అమ్మకాలలో ముందంజలో ఉంది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఓ అవమానకర ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల కానిస్టేబుల్ కి ఇన్స్టాలో ఒక సందేశం వచ్చింది. పంపిన వ్యక్తి ఆమె కారు నంబర్, మొబైల్ నంబర్ను సైతం మెసేజ్ ద్వారా తెలియజేశాడు. అంటే కాకుండా "నువ్వు చాలా అందంగా ఉన్నావు. మనం స్నేహితులుగా ఉండగలమా?" అని సందేశం పంపాడు. దీంతో ఆమె మెసేజ్ చేసిన వ్యక్తిని మందలించింది. సైబర్ క్రైమ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఆసక్తికరమైన విషయం తెలిసింది. 50 ఏళ్ల…
Bharat Margani: బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సినిమా ఫంక్షన్ లకు "పుచ్చుకుని" వెళ్లినట్టు అసెంబ్లీకి వచ్చారా? అని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట తీరు, వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు. నెత్తి మీద విగ్గు, దానిమీద గాగుల్స్, జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మీ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారు. బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేయించాలన్నారు. ఆయన మాట తడపడుతూ మాట్లాడుతున్నారని చెప్పారు.
Bathukamma Festival: తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ సందడి కొనసాగుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఓం శక్తి సత్సంగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, భవాని మాల ధారణ ధరించిన భక్తులు పాల్గొని రకరకాల పూలతో చేసిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేశారు. అనంతరం గౌరీ మాతలను శిరస్సును ఎత్తుకొని అనపర్తి వీరులమ్మ ఆలయం వద్ద నుంచి వినాయకుని ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం…
Vijayawada: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవరాత్రుల నాలుగో రోజు సాయంత్రం 5 గంటల వరకు 66 వేల 300 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం, ప్రసాదం, ఇతర సేవల ద్వారా 30 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ తెలిపారు.