అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్లో చైనాలో పర్యటించేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పశ్చిమాసియా యుద్ధం అట్టుడుకుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇంకోవైపు చమురు, గ్యాస్ సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం కారణంగా చైనా పర్యటన ఆలస్యం కావొచ్చని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Sonia Gandhi vs Deve Gowda: సోనియాగాంధీకి మాజీ ప్రధాని లేఖ.. హాట్ టాపిక్గా అంశాలు
ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో అమెరికా దౌత్య, భద్రతా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన పరిణామాలను సమీక్షించేందుకు అమెరికా పరిపాలన అత్యవసర చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ట్రంప్ చైనా పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే.. ఎక్కడంటే..!
అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలతో సమన్వయం చేయడం ప్రస్తుతం ప్రధాన ప్రాధాన్యతగా మారింది. దీంతో విదేశీ పర్యటనల షెడ్యూల్లో మార్పులు రావొచ్చని అధికారులు సూచిస్తున్నారు. అయితే ట్రంప్ చైనా పర్యటనకు సంబంధించిన కచ్చితమైన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అమెరికా వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్య దేశాల మధ్య దౌత్య చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.