Mirzapur: దుర్గామాతపై అసభ్యకర పాట పాడిన ఫోక్ సింగర్.. తెరవెనుక ఫేమస్ రచయిత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirzapur Folk Singer Saroj Sargam Arrested: హిందూ దేవీ, దేవతలను కించపరుస్తూ మాట్లాడటం, పాటులు పాడటం సర్వసాధారణంగా మారుతోంది. తాజాగా దేశం మొత్తం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటోంది. దుర్గాదేవిని జగన్మాతగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కానీ.. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్కి చెందిన సరోజ్ సర్గం అనే ఫోక్ సింగర్ మాత్రం దుర్గామాతను కించపరుస్తూ పాట పాడింది. తన పాటలో విష్ణుమూర్తిని హంతకుడిగా, దుర్గమ్మను వేశ్యగా.. ప్రహ్లాదుడిని తాగుబోతుగా ఆమె అభివర్ణించింది. ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ రాయ్ ఫిర్యాదు ఆధారంగా మదిహాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ కావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సహ నిందితుడైన సరోజ్ సర్గం భర్త రామిలన్ బింద్లతో పాటు బిర్హా బృందంలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు. ఈ వీడియోను గాయని భర్త రామిలన్ బింద్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
READ MORE: Cancer: ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం.. గుర్తించకపోతే ఇక అంతే సంగతులు!
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
అయితే.. తాజాగా ఈ ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీరిపై అనేక కేసులు నమోదయ్యాయినట్లు పోలీసులు చెబుతున్నారు. మార్చి 23, 2025న నగర కొత్వాలి పోలీస్ స్టేషన్లో గాయని, ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. సరోజ్ సర్గంపై మీర్జాపూర్తో పాటు మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. బిర్హా బృందాన్ని గాయకుడు సరోజ్ సర్గం భర్త రాంమిలన్ బింద్ నిర్వహిస్తున్నారని పోలీసు సూపరింటెండెంట్ సోమెన్ బర్మా తెలిపారు. ఈ గాయని గత రెండున్నర నుంచి మూడు సంవత్సరాలుగా పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) కమ్యూనిటీలపై పాటలు పాడుతున్నారు. కానీ.. తాజాగా వివాదం సృష్టించిన పాటను రచయిత రాజ్వీర్ సింగ్ యాదవ్ ఆదేశం మేరకు తాను కంపోజ్ చేశానని వెల్లడించింది. తన “బహుజన్ నాయక్ మహిషాసుర్” పుస్తకంపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు గెలిచానని రాజ్వీర్ స్వయంగా ఆమెకు చెప్పాడట. కాబట్టి.. తాను భయపడాల్సిన పని లేదని.. ఈ పుస్తకం నుంచే ఈ పాట కంటెంట్ను తీసుకున్నట్లు నిందితురాలు తెలిపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సూత్రధారి రాజ్వీర్ సింగ్ యాదవ్ కోసం వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!