Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..
- చిలుకానగర్లో పట్టపగలే దారుణ హత్య..
- ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కుమార్..
- సంతోష్ నాయక్ అనే వ్యక్తితో సుధీర్కు పాత పరిచయం..
- వాట్సాప్ చాట్ విషయమై చిన్న పాటి ఘర్షణ..
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్లో చెలరేగిన వివాదం.. ఇద్దరు స్నేహితుల మధ్య చిలికి చిలికి గాలివానలా మారింది. హైదరాబాద్ చిలుక నగర్లో అత్యంత దారుణంగా స్నేహితున్ని మర్డర్ చేసే స్థాయికి వెళ్లింది. చనిపోయిన వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు ఈ కేసును కేవలం 8 గంటల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతకీ హంతకులు ఎవరు? వాట్సాప్ చాట్ వివాదానికి ఎందుకు దారి తీసింది?
చిలుకా నగర్ చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన సుధీర్ కుమార్ పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి తండ్రి సుబ్బయ్య కూడా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. ఆయన ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఐతే తండ్రి అడుగుజాడల్లోనే పోలీసు శాఖలో చేరారు సుధీర్. ప్రస్తుతం సిటీ సెక్యూరిటీ వింగ్లో ఏఆర్ కానిస్టేబుల్గా సేవలందిస్తున్నారు. చిలుకా నగర్కు చెందిన సంతోష్ నాయక్ అనే వ్యక్తితో సుధీర్కు పాత పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య ఓ వాట్సాప్ చాట్ విషయమై చిన్న పాటి ఘర్షణ జరిగింది. కానీ ఆ చాటింగ్ కాస్తా తీవ్ర వివాదానికి దారితీసింది. ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఫోన్లోనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సంతోష్ నాయక్. అంతే కాదు సుధీర్ను నేరుగా మాట్లాడుకుందామని చిలుకా నగర్కు పిలిచాడు. ఐతే స్నేహితుడే కదా అనే నమ్మకంతో సుధీర్ అక్కడికి వెళ్లడంతో ఘోరం జరిగిపోయింది.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
Also Read:Hyderabad: ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం.. ఆపై హత్య..
వాట్సాప్ చాట్ పంచాయితీ ముగుస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా జరిగింది. ఆదర్శ్ నగర్ కాలనీ సమీపంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ఆ సమయంలో సంతోష్ నాయక్ తన వద్ద ఉన్న కత్తితో సుధీర్ కుమార్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. సుధీర్ కడుపు, ఛాతీ, మెడ భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సుధీర్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దాడి జరిగిన సమయంలో సంతోష్ నాయక్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో ఇద్దరు నిందితులను కేవలం 8 గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తంతో తడిసిన దుస్తులు, సెల్ ఫోన్లు, బైకు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?