Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..
- చిలుకానగర్లో పట్టపగలే దారుణ హత్య..
- ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కుమార్..
- సంతోష్ నాయక్ అనే వ్యక్తితో సుధీర్కు పాత పరిచయం..
- వాట్సాప్ చాట్ విషయమై చిన్న పాటి ఘర్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్లో చెలరేగిన వివాదం.. ఇద్దరు స్నేహితుల మధ్య చిలికి చిలికి గాలివానలా మారింది. హైదరాబాద్ చిలుక నగర్లో అత్యంత దారుణంగా స్నేహితున్ని మర్డర్ చేసే స్థాయికి వెళ్లింది. చనిపోయిన వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు ఈ కేసును కేవలం 8 గంటల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతకీ హంతకులు ఎవరు? వాట్సాప్ చాట్ వివాదానికి ఎందుకు దారి తీసింది?
చిలుకా నగర్ చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన సుధీర్ కుమార్ పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి తండ్రి సుబ్బయ్య కూడా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. ఆయన ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఐతే తండ్రి అడుగుజాడల్లోనే పోలీసు శాఖలో చేరారు సుధీర్. ప్రస్తుతం సిటీ సెక్యూరిటీ వింగ్లో ఏఆర్ కానిస్టేబుల్గా సేవలందిస్తున్నారు. చిలుకా నగర్కు చెందిన సంతోష్ నాయక్ అనే వ్యక్తితో సుధీర్కు పాత పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య ఓ వాట్సాప్ చాట్ విషయమై చిన్న పాటి ఘర్షణ జరిగింది. కానీ ఆ చాటింగ్ కాస్తా తీవ్ర వివాదానికి దారితీసింది. ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఫోన్లోనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సంతోష్ నాయక్. అంతే కాదు సుధీర్ను నేరుగా మాట్లాడుకుందామని చిలుకా నగర్కు పిలిచాడు. ఐతే స్నేహితుడే కదా అనే నమ్మకంతో సుధీర్ అక్కడికి వెళ్లడంతో ఘోరం జరిగిపోయింది.
Also Read
Also Read:Hyderabad: ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం.. ఆపై హత్య..
వాట్సాప్ చాట్ పంచాయితీ ముగుస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా జరిగింది. ఆదర్శ్ నగర్ కాలనీ సమీపంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ఆ సమయంలో సంతోష్ నాయక్ తన వద్ద ఉన్న కత్తితో సుధీర్ కుమార్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. సుధీర్ కడుపు, ఛాతీ, మెడ భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సుధీర్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దాడి జరిగిన సమయంలో సంతోష్ నాయక్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో ఇద్దరు నిందితులను కేవలం 8 గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తంతో తడిసిన దుస్తులు, సెల్ ఫోన్లు, బైకు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..