IBOMMA Ravi: పైరసీ కింగ్ పిన్గా మారిన ఐ బొమ్మ రవి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇమ్మడి రవి నేదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్ళే ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు. వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ER infotech అనే సాఫ్ట్వేర్ కంపెనీకు CEOగా ఉన్నాడు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తన చదువు, జ్ఞానాన్ని ఉపయోగించి తెలుగు ఇండస్ట్రీని బురిడి కొట్టించాడు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేసిన రవి.. భారీగా…
Shubman Gill Injury: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతోంది. మ్యాచ్లో రెండవ రోజు, కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేస్తూ.. మెడ నొప్పితో వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన గిల్ గాయంతో మైదానం రిటైర్డ్ హర్ట్గా వెళ్లిపోయాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్ 189 పరుగుల వద్ద ముగిసింది. అయితే.. గిల్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కీలక సమాచారం వెలువడింది. గిల్ను స్ట్రెచర్పై వుడ్ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. పలు నివేదికల ప్రకారం..…
Kavitha: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. నిన్న(శనివారం) ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసీఆర్ మళ్లీ పార్టీలోకి పిలుస్తే వెళతారా..? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. "కేసీఆర్ తండ్రిగా పిలిస్తే తప్పకుండా వెళతాను.. రాజకీయంగా పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో పోను.. ఏ పార్టీలోకి నేను ఎందుకు పోతాను.. ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకురాలిని.. బీఆర్ఎస్ నుంచి గెంటి వేయబడ్డ నాయకురాలిగా.. బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోటు పాట్ల గురించి…
Jangaon RTC Bus Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి వైద్య బృందాలు. హనుమకొండ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.…
Kerala: కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఓ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిక్కన్నపురం నివాసి ఆనంద్ కె. తంపి తన షెడ్లో శనివారం ఉరి వేసుకుని బలవన్మణానికి పాల్పడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో కలత చెందినట్లు సమాచారం. తిరువనంతపురం కార్పొరేషన్లోని త్రిక్కన్నపురం వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని తంపి ఆశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు రాలేదు. ఇది చూసి ఆయన…
Hyderabad: గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేసిన రవి.. భారీగా ఆదాయం పొందాడు. సినిమా ఇండస్ట్రీకి మాత్రం వేల కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చాడు. ఇటీవల సినిమా పైరసీలపై సైబర్ క్రైమ్ ఉక్కు పాదం మోపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మూవీ పైరసీ తిమింగలం కోసం పోలీసులు కాపు కాస్తూ ఉండగా నిన్న(శనివారం) అదుపులోకి తీసుకున్నారు. ఈ పోలీసు విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవి…
AICC Holds Introspection Meeting: బీహార్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా “ఏఐసిసి” అధిష్ఠానం ఆత్మశోధన నిమిత్తం సమావేశం నిర్వహించింది. “ఏఐసిసి” అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అగ్ర నేత రాహుల్ గాంధీ తోపాటు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ అంశంపై గంటకు పైగా సమాలోచనలు కొనసాగాయి.. సమావేశంలో వాడి వేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి, ప్రధాని మోడీ చేసిన తీవ్ర విమర్శలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆత్మశోధనలో మునిగిపోయింది.…
Kavitha: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్కి కూత వేటు దూరంలో ఉన్న మెదక్ తలసరి ఆదాయం పెరగలేదన్నారు. పాల రైతులు నష్టపోతున్నారన్నారు. మాజీ మంత్రి హరీష్రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, ఆయన సతీమణి ప్రైవేట్ పాల వ్యాపారం పెట్టుకుని లాభాలు పొందుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు పాలు పోసి లాభాలు పొందారని ఆరోపించారు. సీఎం PROగా ఉన్న అయోధ్య రెడ్డి హరీష్ రావు పాల వ్యాపారం…
Telangana High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కలకలం సృష్టించింది. హైకోర్టు వెబ్సైట్లో ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సైట్లో అంతరాయం ఏర్పాడింది. హైకోర్టు సైట్లో ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ సిబ్బంది ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. Hyderabad సైబర్ అభియోగాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Amit Shah Srinagar Visit: జమ్మూకశ్మీర్ నౌగామ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, 31 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం శ్రీనగర్ను సందర్శించే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. అమిత్ షా సాయంత్రం శ్రీనగర్ చేరుకుంటారని వర్గాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరకుని పోలీస్ స్టేషన్ లోపల జరిగిన పేలుడు సంఘటన గురించి షా ఆరా తీయనున్నారు.