Telangana Cold Wave: రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చలి పులి బేంబెలెత్తిస్తోంది. రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ చలి తీవ్రత అంతకంతకూ పెరిగింది. 11 నుంచి 12 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి నుంచి రక్షణ…
Bihar: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 243 మంది సభ్యులు గల అసెంబ్లీలో 202 స్థానాలను గెలుచుకుని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అఖండ మెజారిటీని సాధించింది. నూతన ప్రభుత్వం, మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ పార్టీల మధ్య ఢిల్లీ, పాట్నాలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇంతలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ, ఎన్నికల కమిషన్ బృందం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పూర్తి జాబితాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు సమర్పించింది.
Cracked Heels Home Remedies: చలికాలం మొదలైతే చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడే సమస్య మడమల పగుళ్లు. చర్మం పొడిగా మారటం, తేమ తగ్గిపోవడం, వయసుతో చర్మం పలచబడటం మరిన్ని ఇతర కారణాలతో మడమలు గట్టిపడి పగుళ్లు పడతాయి. కొందరికి అయితే రక్తం వచ్చేంతగా పగుళ్లు తీవ్రమవుతాయి. నొప్పి, కాలుతున్నట్టుగా అనిపించడం, నడవడానికే ఇబ్బంది పడటం ఇలా అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ కొంచెం జాగ్రత్తలు, ఇంట్లోనే చేసే చిన్న రెమెడీలతో ఈ సమస్యను సులభంగా నియంత్రించుకోవచ్చు.
Best Foods for Liver: లివర్ ఆరోగ్యం బాగుంటేనే మన శరీరం సరిగా పనిచేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడం, టాక్సిన్స్ను తొలగించడం, ఆహారం అరిగేలా చేయడం, పోషకాలను నిల్వ చేయడం ఇలా ఎన్నో కీలక పనులు లివర్ చేస్తుంది. కానీ నేటి జీవన విధానం, ప్రాసెస్డ్ ఫుడ్, ఒత్తిడి, కాలుష్యం, అలవాట్లలో పొరపాట్లు వల్ల లివర్పై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో లివర్ను రక్షించుకోవడానికి ఆహారమే పెద్ద ఆయుధమని నిపుణులు చెబుతున్నారు.
Hyderabad: నగరంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ పంజా విసిరింది.. ఓనర్ ఇంట్లో లేని సమయం చూసి పక్కా స్కెచ్ వేసింది.. మరో నలుగురి సహాయంతో దోపిడీకి ప్లాన్ చేసింది. ఫంక్షన్ నుంచి ఓనర్ ఇంటికి రాగానే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చే ప్రయత్నం చేసింది.. జ్యూస్ తాగి ఓనర్ స్పృహ కోల్పోగానే ఇళ్లు మొత్తం దోచేసింది. 23 లక్షల రూపాయలు, 25 తులాల బంగారంతో ఉండాయించింది. ఈ ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Sabarimala: శబరిమల మండల-మకరవిళక్కు సీజన్ మొదలైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రధాన అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభమవుతాయి. శ్రీకోవిల్ నుంచి తీసుకువచ్చిన పవిత్ర జ్వాలతో 18 మెట్లు వద్ద అధి వెలిగించడం, రాత్రి అభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే భక్తుల దర్శనానికి సోమవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత అనుమతి ఇస్తారు. వృశ్చిక మాసం ఆరంభం కావడంతో అప్పుడే అధికారికంగా తీర్థయాత్ర సీజన్ ప్రారంభమవుతుంది. అయితే.. ఈసారి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేవలం ఆధ్యాత్మికంగా…
Hyderabad Cybercrime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐ-బొమ్మ, బప్పం సైట్లను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సైట్లు క్రియేట్ చేసిన రవితోనే వాటిని క్లోజ్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే.. నిందితుడు ఐ బొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్పల్లిలోని రవి అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు..
CV Anand: దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారని ఆనంద్ తెలిపారు. Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందనలు తెలిపారు.. జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని పేర్కొన్నారు… DCP కవిత, CP సజ్జనార్ కు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. READ […]
Ravi: ఐ బొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్పల్లిలోని రవి అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.. రూ. 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.. వైజాగ్కి చెందిన రవి టెక్నికల్ ఎక్స్పర్ట్ గా గుర్తించారు.. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ ఐనా, ఎంత సెక్యూర్గా ఉంచినా ఈజీగా హ్యాక్ చేయగలిగే ట్యాలెంట్ ఉంది. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్ను సైతం హ్యాక్ చేశాడు. కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి…
Punjab: పంజాబ్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తను కాల్చి చంపారు. ఇంటికి వెళ్తుండగా RSS కార్యకర్తపై దాడి జరిగింది. మృతుడిని నవీన్ అరోరాగా గుర్తించారు. ఈ సంచలనాత్మక సంఘటన తర్వాత.. ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. నిందితులను పట్టుకోవడానికి పంజాబ్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.