Gannavaram Tragedy: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. గన్నవరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!
- గన్నవరం నియోజకవర్గంలో విషాద ఘటన
- ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం
- గన్నవరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఓ కానిస్టేబుల్ బైక్ వెంటపడి హ్యాండిల్ పట్టుకుని లాగడంతో.. విద్యార్థి ఎదురుగా వసున్న బొలెరో వ్యాన్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి…
గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పలగాని ప్రణయ్ ‘కేఎల్ యూనివర్సిటీ’లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతని తమ్ముడు కౌషిక్ విజయవాడలోని ఎంఎంఎం కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజూ కౌషిక్ను తండ్రి శివాజీ ట్యూషన్ కోసం అవుటపల్లి తీసుకెళ్లేవాడు. అయితే శనివారం తండ్రి అందుబాటులో లేకపోవడంతో.. ప్రణయ్ తన తమ్ముడు కౌషిక్ను బైక్పై అవుటపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అన్నదమ్ములు వెళ్తున్న బైక్ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్ బైక్ వెంటపడి హ్యాండిల్ పట్టుకుని లాగాడు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Also Read: Shikhar Dhawan: ఎంఎస్ ధోనీ ఎంతో మంది క్రికెటర్ల కెరీర్లను తీర్చిదిద్దాడు.. కష్టకాలంలో అండగా ఉంటాడు!
కానిస్టేబుల్ హ్యాండిల్ పట్టుకోవడంతో ప్రణయ్ భయంతో బైక్ను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ప్రణయ్కు తీవ్ర గాయాలు కాగా.. అతని తమ్ముడు కౌషిక్ కూడా గాయపడ్డాడు. ఇద్దరినీ వెంటనే సమీపంలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణయ్ మృతి చెందాడు. తమ్ముడు కౌషిక్కు చికిత్స కొనసాగుతోంది. కొడుకు మృతి చెందడం, మరో కొడుకు గాయపడటంతో శివాజీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రణయ్ మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. బంధువులు, తోటి విద్యార్థులు అక్కడికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!