Kerala: బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఓ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిక్కన్నపురం నివాసి ఆనంద్ కె. తంపి తన షెడ్లో శనివారం ఉరి వేసుకుని బలవన్మణానికి పాల్పడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో కలత చెందినట్లు సమాచారం. తిరువనంతపురం కార్పొరేషన్లోని త్రిక్కన్నపురం వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని తంపి ఆశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు రాలేదు. ఇది చూసి ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ తనకు టికెట్టు ఇవ్వకున్నా.. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని తంపి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నం తన స్నేహితులకు వాట్సాప్ సందేశం పంపారు. అందులో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సందేశంలో పేర్కొన్నారు. వాట్సాప్ సందేశాన్ని చూసిన అతని స్నేహితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆ కార్యకర్త ఉచ్చుకు వేళాడుతూ కనిపించారు. వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: Astrology: నవంబర్ 16, ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
Also Read
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే తన ఉద్దేశ్యాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఇప్పటికే తెలియజేసినట్లు తంపి తన సందేశంలో పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా మాఫియాతో సంబంధం ఉన్న కొంతమంది స్థానిక నాయకుల ప్రయోజనాల కారణంగా తనకు టికెట్ నిరాకరించారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను ప్రకటించిన తర్వాత.. తన స్నేహితులు సైతం తనకు దూరం కావడం ప్రారంభించారని.. అది తనను నిరాశపరిచిందని సందేశంలో పేర్కొన్నారు. అయితే, టికెట్ కోసం తంపి తమను ఎప్పుడూ సంప్రదించలేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు. టికెట్టు రాకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వాదనలను తోసిపుచ్చారు. ఈ సంఘటనకు టికెట్ నిరాకరించడానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్టీ ఖచ్చితంగా దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు. “ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అంశంపై జిల్లా అధ్యక్షుడిని విచారించాను. వార్డు స్థాయి నుంచి పంపిన షార్ట్లిస్ట్లో తంపి పేరు లేదని నాకు తెలిసింది. ఈ విషయంపై పార్టీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంది.” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!