Kishan Reddy: జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు.. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని.. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయని.. తమ పార్టీ అక్కడ బలహీనంగా ఉందన్నారు. ఓటమిని విశ్లేషించుకుంటామని తెలిపారు. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదన్నారు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం.. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ…
KTR Reacts to Congress Victory in Jubilee Hills Byelection; జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎగ్జిట్పోల్స్ అంచనాలకు మించి మెజారిటీ సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ అంశంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్ నిర్వహించారు.
Jubilee Hills Byelection Results: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు పలు డివిజన్ బాధ్యలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రులు మంత్రుల పెర్ఫార్మెన్స్ గురించి చూద్దాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్ నగర్లో పూర్తి మెజార్టీ తెచ్చిపెట్టారు.
Bomb Threat: ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బిగ్ అలర్ట్ వచ్చింది. ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఎయిర్పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వస్తున్న ఇండిగో విమానం, లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఇండిగో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు అధికారులు. లండన్ నుంచి…
Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాగా.. ఇందులోనూ హస్తం పార్టీ మెజారిటీ కనబరిచింది. తొలి రౌండ్లో కాంగ్రెస్కు ఆధిక్యం లభించింది.. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్లో కాంగ్రెస్కు 8,926 ఓట్లు, బీఆర్ఎస్ 8,864 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీ 9,691 ఓట్లు సాధించి 1144 ఓట్ల ముందంజలో నిలిచింది.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. అభ్యర్థిగా పోటీలో ఉన్న 40 ఏళ్ల మహమ్మద్ అన్వర్ గుండెపోటుకు గురై మరణించారు. ఎర్రగడ్డలో నివాసి అన్వర్ కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠ ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఛాతి నొప్పితో కుప్పకూలినట్లు తెలుస్తోంది. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు.
Nitish Kumar: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలుడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. నవంబర్ 6న మొదటి దశ పోలింగ్ జరిగింది. ఇందులో 65 శాతం ఓటర్లు ఓటు వేశారు. నవంబర్ 11న జరిగిన రెండవ దశ పోలింగ్లో దాదాపు 69 శాతం ఓటర్లు ఓటు వేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి వస్తారా లేదా తేజస్వి యాదవ్ కల నెరవేరుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నితీష్ 20 సంవత్సరాలుగా బీహార్…
Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసఫ్గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో, 42 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్కు ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ పనుల్లో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
Bihar Assembly Election Results: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు విడతల్లో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత EVMల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు దృష్ట్యా, అన్ని జిల్లాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం అవసరమైన అన్ని సన్నాహాలు చేసింది.
Bunny Vasu: "అందరికి విజయ్ దేవరకొండ, మాకు మాత్రం బంగారు కొండ" అంటూ నిర్మాత బన్నీ వాస్ విజయ్ ను ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో ప్రశంసించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నవంబర్ 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడంతో ఆ మీట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు విజయ్ దేవరకొండను నిర్మాత బన్నీ వాస్ పొగడ్తలతో ముంచెత్తారు.