DGP Nalin Prabhat: శ్రీనగర్ పేలుడుపై జమ్ము కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పందించారు. నౌగాం పోలీస్ స్టేషన్లో బ్లాస్ట్ ఓ యాక్సిడెంట్.. ఇదొక దురదృష్ట ఘటన అన్నారు. దీనిపై ఎలాంటి ఊహగానాలు చేయవద్దని స్పష్టం చేశారు. "నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో వెలుడు పదార్థాలు ఉంచాం.. ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాం. గత రెండు రోజుల నుంచి ప్రొసీజర్ కొనసాగుతోంది. శాంపిల్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రాత్రి 11 గంటలకు 20 నిమిషాలకు యాక్సిడెంట్ జరిగింది.…
Bihar Election: బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. NDA 200 సీట్లకు పైగా గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించింది. మహా కూటమి 50 కూడా దాటలేకపోయింది. అయితే.. ఈ ఎన్ని్కల్లో కొంతమంది అభ్యర్థులు రికార్డు సంఖ్యలో గెలుపొందారు. మరికొందరు అతి తక్కువ తేడాతో విజయ కేతనం ఎగురవేశారు. బీహార్ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన అభ్యర్థుల జాబితాలో జేడీయూ అభ్యర్థి రామ్చరణ్ షా అగ్రస్థానంలో ఉన్నారు. సందేశ్ నియోజకవర్గంలో పోటీ చేసిన రామ్చరణ్ కేవలం 27 ఓట్ల తేడాతో గట్టేక్కారు. ఆయనకు…
iBomma Operator Ravi Arrested: పోలీసులకే ఛాలెంజ్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. విదేశాల నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఎయిర్పోర్టులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. సినీ పరిశ్రమతో పాటు పోలీసు అధికారుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు ఐబొమ్మ నిర్వాహకుడు రవి.. తన వెబ్సైట్పై కన్ను వేస్తే అందరి జీవితాలు రోడ్డుపై వేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.. గత ఆరు నెలలుగా ఐ బొమ్మ నిర్వాకుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. సినీ పరిశ్రమకు రూ. 3000…
Kerala Wedding Goes Viral as Bride’s Father Uses QR Code: భారతదేశంలో డిజిటల్ విప్లవం ఎంత వేగంగా పాకిందో.. ఇప్పుడు పెళ్లి వేడుకల్లో కూడా అదే రంగు కనిపిస్తోంది. టీ దుకాణం నుంచి బంగారు దుకాణం వరకు అందరూ వాడే క్యూఆర్ కోడ్లు ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా చదివింపుల కోసం ఉపయోగపడటం కొత్త ట్రెండుగా మారుతోంది. తాజాగా కేరళలో జరిగిన ఓ వివాహం ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఈ పెళ్లిలో వధువు తండ్రి తెల్లటి షర్ట్ జేబుపై పేటీఎం క్యూఆర్ కోడ్ను…
Nalgonda: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్యం వికటించింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న 15 మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇంజెక్షన్ వికటించడంతోనే పిల్లలకు వాంతులు, విరోచనాలు, చలి, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పిల్లల పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి సిబ్బంది వారిని అత్యవసరంగా ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రిల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
RTC special buses Medaram: మేడారం మహజతర నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 16 నుంచి హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడిపించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రతిరోజు ఉదయం 6.10, 7.00, 8.00, 9.00, మధ్యాహ్నం 12.10, 1.00, 1.40, 14.30; రాత్రి8.30గంటలకు మేడారానికి బస్సులు బయలుదేరనున్నాయి. ఇక మేడారం నుంచి ఉదయం 5.45, 9.45, 10.15, 11.15, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 4.00, 5.00, 5.30, 6.00…
West Bengal: బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన అఖండ విజయం కోల్కతాలో సంచలనం సృష్టించింది. ఈ అంశంపై శుక్రవారం మోడీ మాట్లాడుతూ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్ అని తెలిపారు. అడవి రాజ్యాన్ని కూల్చివేసినట్లు ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోల్కతా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెడు వార్త వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యం లేదని టీఎంసీ వర్గాలు ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపినట్లు సమాచారం. తమకు…
Mehbooba Mufti: ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని నిన్న భద్రతా దళాలు పేల్చివేసిన విషయం తెలిసిందే. ఈ పేల్చివేతను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఖండించారు. అనుమానిత ఉగ్రవాదుల స్నేహితులు, వారి కుటుంబాలపై చర్య తీసుకోవడం లోయలో భయానక వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ఢిల్లీ పేలుడులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ పార్టీ అనుకూలంగా ఉందన్నారు. అయితే ఈ ప్రక్రియలో నిందితులకు చెందిన అమాయక కుటుంబ సభ్యులకు శిక్ష పడకుండా ప్రభుత్వం…
Srinagar Blast: జమ్మూకశ్మీర్లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ శ్రీనగర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు శబ్ధం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. పోలీస్ స్టేషన్ భవనంలోని ఓ భవన భాగం కూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. మానవ అవశేషాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. నౌగామ్ పేలుడు తర్వాత జమ్మూకశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. డీజీపీ నళిన్ ప్రభాత్…
Salumarada Thimmakka: కర్ణాటకకు చెందిన వృక్షమాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత 114 ఏళ్ల సాలుమరద తిమ్మక్క అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ సమాచారాన్ని కుటుంబీకులు సమాచారం అందించారు. తిమ్మక్క మృతిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తంచేశారు.