Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Chapped Lips: పెదవులు పగిలియా? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
Chapped Lips: చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని […] -
Kadiyam Srihari: దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
Kadiyam Srihari: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణదని, ఈనెల 26 నుంచి ఎకరాకు 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా జమ చేయబడుతుందని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక చర్యలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25 లక్షల […] -
Telangana Voters: ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల కమిషన్..
Telangana Voters: పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,35,27,925 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషు ఓటర్లు 1,66,41,489 మంది, మహిళా ఓటర్లు 1,68,67,735 మంది, థర్డ్ జండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నట్లు తెలిపారు. అలాగే యువ ఓటర్లు (వయస్సు 18-19 సంవత్సరాలు) 5,45,026 […] -
Winter Season: చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఈ గింజల్ని తింటే సరి
Winter Season: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టసాధ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా రోగాలను చేరదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్లో మీ ఆహారంలో శరీరానికి లోపలి నుండి వెచ్చదనం, పోషణను అందించే పదార్థాలను చేర్చుకోవడం అవసరం. చలికాలంలో విత్తనాలను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే చక్కని అలవాటు. ఈ విత్తనాలు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఇంకా ఖనిజాలు వంటి పుష్టికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. విత్తనాలను పచ్చిగా తినవచ్చు లేదా […] -
Redmi 14C: 50MP డ్యూయల్ కెమెరాతో బడ్జెట్ ఫోన్ను రిలీజ్ చేయనున్న రెడీమి
Redmi 14C: స్మార్ట్ఫోన్ మార్కెట్లో షియోమీ (Xiaomi) సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఇకపోతే, అతి త్వరలో భారతదేశంలో రెడీమి 14C 5G పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 50MP కెమెరా, 5,160mAh, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. దీని ధర, స్పెసిఫికేషన్లుఎం, కెమెరా మొదలైన వాటి గురించి మాకు వివరంగా చూద్దాం. Also Read: Allu Arjun: అల్లు అర్జున్’ను వదలని పోలీస్ టెన్షన్? రెడీమి 14C 5G ప్రారంభ ధర […] -
Alleti Maheshwar Reddy: హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి
Alleti Maheshwar Reddy: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, తాజా క్యాబినెట్ నిర్ణయాలు నిరాశకు గురిచేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై స్పష్టత లేకపోవడం, పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: DaakuMaharaaj […] -
Minister Seethakka: నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా
Minister Seethakka: పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి […] -
K Laxman: కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ ఫైర్
K Laxman: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12 వేలకు కోత పెట్టిందని తెలిపారు. మాయమాటలు చెప్పి […] -
DK Aruna: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాజెక్టు తీసుకురావడంలో తన పాత్రను గుర్తు చేస్తూ అరుణ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తెచ్చింది నేనే.. మా నాన్న పాలమూరు కోసం అనేక పోరాటాలు చేశారు, మా కుటుంబం జిల్లా కోసం ప్రాణాలు అర్పించిందని తెలిపారు. వారిని గుర్తుచేసే […] -
Addanki Dayakar: రైతు భరోసాపై విమర్శలు చేసే వారికి అద్దంకి దయాకర్ కౌంటర్
Addanki Dayakar: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వస్తున్న విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప దేనికీ పనికిరారని ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో రైతులు ఎన్నో గడ్డు రోజులు ఎదుర్కొన్నారని అన్నారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు ఋణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం […]
తాజావార్తలు
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!