Control Room: సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర రియాక్టర్ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం, గాయాలు జరిగిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం యాక్టివ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రమాద బాధితుల కోసం ప్రత్యేక సహాయ చర్యల నిమిత్తం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ […]
Konda Murali: వరంగల్ నగరంలోని వైశ్య భవన్ లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సంఘం నాయకులు తమ డబ్బులను గోల్మాల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటూ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమానికి హాజరైన కొండా మురళి సమస్యలను పరిష్కరిస్తానని, అలాగే అనేక విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also:Gang Rape Case: “అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన […]
Harish Rao: పాశమైలారం పరిశ్రమ పేలుడు ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నేడు జరిగిన పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు హరీష్ రావుతో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రావు కలిసి పటాన్ చెరులోని ధ్రువ ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు. Read Also:Reactor […]
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. Read Also:Kubera : పదేళ్లకే […]
CM Chandrababu: నేడు విజయవాడలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST) ఆధ్వర్యంలో జరుగుతున్న టూరిజం కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగా పరిష్కారమని, యోగా నిత్య జీవితంలో భాగం కావాలన్నారు. ప్రధాని మోడీ యోగాను దేశంలో ప్రమోట్ చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా డే ఇంత గ్రాండ్ గా జరుగుతుందని ఎవరూ ఊహించలేదని.. కానీ 3 లక్షలకు పైగా విశాఖపట్నం లో పాల్గొని గిన్నిస్ […]
Baba Ramdev: గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST) ఆధ్వర్యంలో జరుగుతున్న టూరిజం కాంక్లేవ్లో పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును విజనరీ నేతగా అభివర్ణించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు. సీఎం చంద్రబాబు కేవలం రాజకీయ నేత కాదు.. ఒక విజనరీ. ఆయనకు అభివృద్ధిపై స్పష్టమైన దృక్కోణం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించిన అభివృద్ధికి […]
CBIL Score: ప్రస్తుత రోజుల్లో సిబిల్ స్కోర్ ఎంత ప్రధానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆర్థికపరమైన అవసరాలకు సంబంధించైనా సరే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ ఉపయోగించుకుని అనేక ఆర్థికపరమైన చర్యలను చేపట్టవచ్చు. ముఖ్యంగా లోన్ సంబంధించిన విషయంలో ఈ సిబిల్ స్కోర్ ఉపయోగపడుతుంది. ఈ సిబిల్ స్కోర్ వ్యక్తి తీసుకున్న సరైన సమయంలో చెల్లింపుల పై ఆధారపడి ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. Read Also:YS Jagan: జగన్ క్వాష్ పిటిషన్ […]
Electric Bike Explode: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్కు పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారిగా పేలింది. అదేసమయంలో ఆ వాహనం పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక పోలీసుల సమాచారం మేరకు వెంకట లక్ష్మమ్మ అనే మహిళ తన ఇంటి వరండాలో ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ పెడుతూ, అదే చోట ఉన్న సోఫాలో నిద్రించడంతో ప్రమాదం జరిగింది. Read Also:Singam Style […]
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురిని పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన ప్రమాద ఘటనపై కేసులో నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్గా దాఖలైన ఈ కేసుపై న్యాయమూర్తి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. Read Also:Singam […]
Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధి దిశగా బడ్జెట్, విధానాలు, ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST), ఏపీటీడీసీ సంయుక్తంగా నిర్వహిస్తున్న టూరిజం కాన్క్లేవ్ టెక్ AI 2.0 రెండవ రోజు సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని కీలక అభిప్రాయాలను తెలిపాడు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక విధానాల అమలులో గణనీయ పురోగతి సాధించేందుకు మౌలిక […]