PMO Office: డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై PMO ఉన్నత స్థాయి సమావేశం
- డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై PMO ఉన్నత స్థాయి సమావేశం
- ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం.
- కొత్త సుంకాల ప్రభావం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటనను అంచనా వేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, డీఐఐటీ ఇంకా ఇతర విభాగాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని, సుంకాల ప్రభావాలను పిఎంఓకు వివరించారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ట్రంప్ సుంకాలపై ఉన్నతస్థాయిలో అంచనాలను తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
Read Also: Amazon Project Kuiper: తొలి ఇంటర్నెట్ ఉపగ్రహాల కోసం ప్రాజెక్ట్ ‘కైపర్’ను సిద్ధం చేసిన అమెజాన్
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
ఇందులో భాగంగా.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ట్రంప్ సుంకాలపై స్పందిస్తూ, ఈ నిర్ణయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం వాణిజ్య సంబంధిత సమస్యలను పరిష్కరిస్తే, అమెరికా ఈ సుంకాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం షాక్ కలిగించదని, మిశ్రమ ఫలితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, అమెరికా సుంకాలను తగ్గించే దిశగా సరైన ప్రతిస్పందనలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇకపోతే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రకాల సుంకాలను విధించారు. మొదటి సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ సుంకం అన్ని దేశాలతో పోల్చితే 10 శాతం బేస్ టారిఫ్గా అమలు చేయబడుతుంది. గతంలో ఈ సుంకం 2.5 శాతంగా ఉండేది. ఈ నిర్ణయం ద్వారా అమెరికా అన్ని దేశాలకు బేస్ టారిఫ్ను పెంచింది. ఇక రెండో విషయానికి వస్తే., ప్రతి దేశంపై వేర్వేరు సుంకాలను విధించడం ప్రారంభించనుంది. అంటే ఒక దేశం అమెరికాపై 40 శాతం సుంకం విధిస్తే, అమెరికా ఆ దేశంపై 20 శాతం సుంకం విధించినట్లుగా సమాచారం. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అమెరికా భారతదేశంపై 26 శాతం సుంకం విధించబోతున్నట్లు సమాచారం.
Read Also: Viral Video: అర్ధరాత్రి వంటింటి గోడపై ప్రత్యక్షమైన మృగరాజు!
ఈ కొత్త సుంకాల ప్రభావం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. అమెరికా సుంకాలను పెంచడం భారతదేశానికి కూడా కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు, కానీ ఈ సుంకాలను తగ్గించడానికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఈ పరిణామాలను సమీక్షించి, అవసరమైన చర్యలను తీసుకుంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!