మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం చట్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో శివరామకృష్ణ కమిటీ వేసి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని బొత్స ఆరోపించారు. రాజధానిపై ఆనాటి ప్రకటన ఏదైనా పార్లమెంట్కు పంపలేదు కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధాని అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాజధాని […]
తెలంగాణలో ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా ఫించన్లను అందజేయనున్నట్లు మంత్రి హరీష్రావు వెల్లడించారు. వృద్ధాప్య ఫించన్ల మంజూరు కోసం వయో పరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. కరోనా సంక్షోభం కారణంగా దీని అమలులో జాప్యం జరిగిందని మంత్రి హరీష్రావు తెలిపారు. 2014లో ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్య 29,21,828 మాత్రమే ఉండగా ప్రస్తుతం తెలంగాణలో లబ్ధిదారుల సంఖ్య 38.41 లక్షలకు పెరిగిందని స్పష్టం చేశారు. గత […]
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. సభా నాయకుడి హోదాలో సీఎం జగన్, సభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ […]
ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్పై రష్యా మిలటరీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఉక్రెయిన్ను ఉద్దేశించి హెచ్చరించారు. మూడో దఫా జరిగే శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్కు పుతిన్ సూచించారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సుదీర్ఘంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ […]
వేసవి సీజన్ వచ్చేసింది. వేసవిలో ప్రతిఒక్కరూ ఫ్రిజ్ కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తారు. ఫ్రిజ్లోని నీరు తాగాలని ఆరాటపడతారు. అయితే అలాంటి వారికి మట్టికుండ విలువ తెలియదు. సాధారణంగా మట్టికుండను పేదవాడి ఫ్రిజ్ అంటారు. మట్టికుండలో నిల్వ చేసిన నీళ్లు అమృతంలా ఉంటాయని మన పెద్దలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. పూర్వకాలంలో మట్టికుండలోని నీళ్లను మాత్రమే అందరూ తాగేవారు. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కాలం మారే కొద్దీ మట్టి కుండలు కాకుండా జనాలు రిఫ్రిజిరేటర్లకు అలవాటు […]
వైసీపీ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్గా విజయసాయిరెడ్డిని ఇటీవల సీఎం జగన్ నియమించగా.. అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం నాడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ సభ్యత్వ నమోదులో ప్రతిఫలించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. తెలుగువారు […]
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఉన్నత విద్య అభ్యసించడం కోసం ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేస్తానని గత నెల 23న మంత్రి కేటీఆర్ ప్రకటించగా తాజాగా సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే… జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజమల్లు ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేశాడు. కోవిడ్ సమయంలో ఆయన ఉపాధి పోయింది. దీంతో కూలీ పనులు చేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. ఆయన ఇద్దరు కుమార్తెలు కావేరి (21), […]
శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు కెప్టెన్గా మొదటి మ్యాచ్. తొలి మ్యాచ్లోనే భారీ విజయం సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మకు మధురానుభూతిని మిగిల్చింది. అయితే శ్రీలంకపై ఘనవిజయం సాధించినా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడగా వాటిలో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలై మంచి హిట్ సాధించడం, పుష్ప-2 సినిమాకు కాస్త టైం దొరకడంతో ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే బన్నీ ఒకవైపు సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ ఇప్పటికీ అంతే ప్రేమగా ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తున్నాడు. 2011 మార్చి 6వ తేదీన అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. నేటికి వీరి వివాహం […]
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మేనియా ఇంకా తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇటీవల క్రికెటర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో తగ్గేదే లే అంటూ బన్నీ మేనరిజాన్ని ఇమిటేట్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ […]