PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వ దారుణాలు..
- కాల్పుల్లో 12 మంది సాధారణ ప్రజలు మృతి..
- హక్కుల కోసం ఉద్యమిస్తున్న పీఓకే ప్రజలు..
- మీడియాపై ఆంక్షలు, 4000 మంది రేంజర్ల మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీ హింస చెలరేగింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ముజఫరాబాద్ లాంగ్ మార్చ్కు ముందు మంగళవారం జరిగిన ఘర్షణల్లో 12 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న పీఓకే ప్రజల్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం, ఆర్మీ దారుణంగా వ్యవహరిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపైకి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ ఈ ప్రాంతంలో 4000 మంది రేంజర్స్, పోలీసులు, ఫ్రంటియర్ కార్ప్స్ బలగాలను మోహరించింది.
రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టనున్న ఈ నిరసన యాత్రను అడ్డుకునేందుకు పీఓకేలో భారీ భద్రతను మోహరించారు. రావల్కోట్లో మీడియాపై అనధికార ఆంక్షలు విధించారని, జర్నలిస్టులను అనుమతించడం లేదని బీబీసీ ఉర్దూ నివేదించింది. పీఓకేలో గత నెల రోజుల నుంచి ద్రవ్యోల్బణం, రాజకీయ ప్రాతినిధ్యం, వివక్ష వంటి అంశాలపై నిరసన కొనసాగుతోంది. పీఓకే అసెంబ్లీలో కాశ్మీర్ శరణార్థులకు సీట్లను రిజర్వ్ చేయడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రిజర్వేషన్ల ద్వారా పీఓకేలో అధికారం చెలాయించాలని పాక్ ప్రభుత్వం భావిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇదిలా ఉంటే, ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏఏసీ సంస్థను పాక్ ప్రభుత్వం నిషేధించింది. ఇక ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వాన్ని పీఓకేకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించింది. నిత్యావరసరాలు, మందుల వంటి అత్యవసర వస్తువుల్ని బ్లాక్ చేస్తోంది. ఫలితంగా ఉద్యమాన్ని అణచాలని చూస్తోంది. ఇంటర్నెట్ను సస్పెండ్ చేసింది. దీంతో పీఓకేలో ఏం జరుగుతుందో మిగతా ప్రపంచానికి తెలియకుండా పాక్ జాగ్రత్త పడుతోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!